ఎన్టీఆర్ ఆర్ట్స్( NTR Arts ) గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు తెలిసిందే.ఎన్టీఆర్ ఆర్ట్స్ హైదరాబాదులోని బంజారాహిల్స్లోని కొలువు దీరిన భారతీయ చలనచిత్ర నిర్మాణ సంస్థలలో ఒకటి.
నటుడు నందమూరి కళ్యాణ్ రామ్( Nandamuri Kalyan Ram ) స్థాపించిన దీనికి, తన తాత, నటుడు మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నందమూరి తారక రామారావు( Nandamuri Taraka Ramarao ) పేరు పెట్టి రిజిస్టర్ చేయడం జరిగింది.ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా భాగంగా సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడి, వశిష్ఠ, వంటి దర్శకులు టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.

అయితే ఎన్నో ఆశలు పెట్టుకొని నటుడు, నిర్మాత కళ్యాణ్ రామ్ స్థాపించిన ఈ బేనర్ అతనిని అనేక కష్టాల్లోకి నెత్తిన సంగతి మీకు తెలుసా? ఈ బేనర్లో మొదట కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన సినిమాలు వరుసగా రాగా అందులో దాదాపుగా అన్ని సినిమాలు ప్లాపులుగా మిగలడంతో కళ్యాణ్ రామ్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయాడు.ఈ క్రమంలో వచ్చినవే.జయీభవ, కత్తి, ఓం త్రీడి, హరే రామ్, ఇజం సినిమాలు.ఈ 5 సినిమాలు సూపర్ ప్లాపులుగా మిగలడంతో ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ దాదాపు ఎత్తివేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
అయితే ఆ తరువాత కళ్యాణ్ రామ్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన పటాస్ సినిమా మాత్రం అతనికి కాస్త ఊరటనిచ్చింది.కానీ అప్పటికీ బేనర్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోవడం వలన అన్న కళ్యాణ్ రామ్ తమ్ముడు ఎన్టీఆర్( NTR ) సపోర్ట్ తీసుకున్నాడు.

ఇక అలా ఎన్టీఆర్ బేనర్ లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సినిమా జై లవకుశ( Jai Lavakusa ) ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసినదే.అదేవిధంగా ఎన్టీఆర్ ఇటీవల చేసిన దేవర( Devara ) కూడా అదిరిపోయే కలెక్షన్లు రాబట్టి ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ని మరో మెట్టు పైకి ఎక్కించింది.అలా ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ కష్టాల బాటనుండి లాభాల బాట పట్టడానికి ఎన్టీఆర్ ప్రత్యక్షంగా కారకుడు అయ్యాడు.ఇక కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ మధ్య సన్నిహిత సంబంధం గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పెనీలేదు.
నందమూరి హరికృష్ణ వారసులు అయినటువంటి వీరు ఇద్దరూ ఎల్లపుడూ చాలా సాన్నిత్యంతో మెలుగుతూ ఉంటారు.ఇక ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సినిమా కూడా ఇదే బేనర్లో వస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.