ఈ మధ్యకాలంలో దొంగలు సెలబ్రిటీల ఇళ్లను( Celebrity Houses ) టార్గెట్ చేస్తున్నారు ఈ క్రమంలోనే సెలబ్రిటీల ఇళ్లల్లో పెద్ద ఎత్తున చోరీలకు పాల్పడుతూ చేతికి అందినది దోచుకెళ్తున్నారు.కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నటువంటి ఐశ్వర్య రజనీకాంత్, నటి శోభన, సౌందర్య రజనీకాంత్ ఇళ్లల్లో వరుసగా దొంగతనాలు జరిగిన సంగతి మనకు తెలిసిందే.
అయితే వీరి ఇళ్లల్లో పని మనుషులే దొంగతనాలకు పాల్పడ్డారు అంటూ పోలీసుల విచారణలో బయటపడ్డాయి.ఈ విధంగా సెలబ్రిటీల ఇళ్లల్లో దొంగతనం( Theft in Celebrities Houses ) జరిగిన విషయం మర్చిపోకముందే మరొక సెలబ్రిటీ ఇంట్లో దొంగతనం జరిగింది.
1998 ఘర్షణ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమయ్యారు నటి నిరోషా( Nirosha ).ఇలా నటిగా తెలుగు తమిళ భాష చిత్రాలలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్నారు.అయితే తాజాగా నిరోషా ఇంటిలో కూడా దొంగతనం జరిగింది అంటూ ఆమె తాజాగా తేనాంపేట పోలీసులను ఆశ్రయించి తన ఇంట్లో జరిగినటువంటి దొంగతనం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు విచారణ చేపడుతున్నారు.
ఇక ఈ ఫిర్యాదులో భాగంగా నిరోష దొంగలు తన ఇంట్లో కొన్ని బంగారు ఆభరణాలతో( Gold Jewelry ) పాటు ఆస్తులకు సంబంధించిన కొన్ని పత్రాలు కూడా దొంగలించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇలా బంగారు నగలతో పాటు ఆస్తి పేపర్లు కనిపించకపోవడంతో అనుమానం వచ్చినటువంటి ఈమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే దొంగలు దోచుకెళ్ళినటువంటి బంగారపు విలువ కొన్ని లక్షల విలువ చేస్తుందని ఈమె వెల్లడించారు.ఇక నిరోష తన ఇంట్లో దొంగతనం జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇది కాస్త వెలుగులోకి వచ్చింది.