టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు.లోకేశ్ ది యువగళమా.? లేక యువగంగాళమా అని విమర్శించారు.
సూర్యుడు అస్తమించిన తరువాత లోకేశ్ యాత్ర ప్రారంభమవుతుందని పేర్ని నాని ఎద్దేవా చేశారు.
పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకోకుండా బూతులు తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.సంస్కార హీనంగా మాట్లాడటమే టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో అని పేర్కొన్నారు.
ప్రజలకు ఐదు హామీలు ఇచ్చి తనను నమ్మాలని లోకేశ్ చెబుతున్నారన్న పేర్ని నాని వాళ్లు ఇచ్చిన ఆ ఐదు హామీలు జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్నవేనని స్పష్టం చేశారు.లోకేశ్ మూర్ఖుడంటా అన్న పేర్నినాని మూర్ఖుడికి అధికారం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు.
చంద్రబాబు కంటే లోకేశ్ చెడ్డ వ్యక్తి అని నిరూపించుకుంటున్నారా ప్రశ్నించారు.