కర్ణాటక సీఎం అభ్యర్థిపై గత మూడు రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది.ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యనే అధిష్టానం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
సీనియారిటికే పార్టీ హైకమాండ్ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఎమ్మెల్యేలు సైతం ఆయనకే మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.ఈ విషయంపై సిద్ధరామయ్యతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమావేశమై చర్చించారు.
దీంతో కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారని సమాచారం.ఈ విషయాన్ని అధికారికంగా ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ప్రకటించనున్నారు.
మరోవైపు లింగాయత్, ముస్లింతో పాటు దళిత వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వనున్నారని తెలుస్తోంది.