జోష్ సినిమాతో( Josh Movie ) డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయం అయిన వ్యక్తి వాసు వర్మ( Vasu Varma ) ఈ సినిమా బాగున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది.అయినప్పటికీ ఈ డైరెక్టర్ మీద ఉన్న నమ్మకంతో ప్రొడ్యూసర్ దిల్ రాజు అదే బ్యానర్ లో ఒక సినిమా చేద్దాం అని ఫిక్స్ అయి సునీల్ హీరోగా కృష్ణాష్టమి అనే సినిమా చేశారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది ఇక అప్పటి నుంచి వసువర్మ సినిమా డైరెక్షన్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు అయితే ఇటీవల తెలిసిన న్యూస్ ఏంటంటే దిల్ రాజు బ్యానర్ లోనే వాసు వర్మ కూడా ఒక సినిమా చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి…
ఇక తెలుస్తున్న విషయాల ప్రకారం వాసు వర్మ ఒక మంచి స్టోరీ ని దిల్ రాజు( Dil Raju ) గారికి చెప్పినట్లుగా తెలుస్తోంది.దాంతో ఆయన ఈ సినిమాలోకి శర్వానంద్ ని( Sharwanand ) తీసుకుంటున్నట్లు గా తెలుస్తూనే ఉంది.అయితే ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండటం అది కూడా ముంబై ప్రాంతం లో జరుగుతున్నా స్టోరీ గా తెలుస్తుంది…ఇక ఈ సినిమా స్టోరీ ఏంటి అనేది ఇక తెలియాల్సి ఉంది.దిల్ రాజు సంస్థ తో వాసు వర్మ కి ఉన్న అనుభందం వల్ల ఆయన వాసు వర్మ కి ఇన్ని సార్లు అవకాశం ఇస్తున్నారు అంటూ చాలా మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు…
అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఒక కొత్త అమ్మాయిని తీసుకునే ఆలోచన లో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఈ సినిమా తొందర్లోనే పూజ కార్యక్రమాలను జరుపుకొని రెగ్యులర్ షూట్ కూడా జరుపుకోనుంది అని తెలుస్తుంది.ఇప్పటికే శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు అది పూర్తి అయిన వెంటనే ఈ సినిమా ఉంటుందని అని తెలుస్తుంది…