సాధారణంగా మన ఇళ్లల్లో ఆడవాళ్లు కట్టుకొనే చీరల ధరలు ఎంత వరకు ఉంటాయి? సాధారణ చీర అయితే ఓ రూ.500, అదే మంచి పట్టు చీర అయితే కనీసం రూ.10 వేలు దాకా ఉంటుంది.లేదంటే కొంచెం అటుఇటుగా రూ.లక్ష రూపాయిల చీర కొనుక్కొనేవారు కూడా వుంటారు.అయితే చీర కోసం ఏకంగా రూ.40 లక్షల రూపాయిలు ఖర్చు చేసిన వారి గురించి మీకు తెలుసా? ఆ చీర ఎవరు ధరిస్తారో తెలుసుకోవాలంటే.ఈ మొత్తం స్టోరీ చదవాల్సిందే.
ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ భార్య, పారిశ్రామికవేత్త నీతా అంబానీ పేరు మీరు వినే వుంటారు.ఆమె ఖరీదైన, విలక్షణమైన దుస్తులు ధరిస్తారనే పేరు కూడా ఉంది.కాగా నీతా అంబానీ పెళ్లికి ధరించిన చీర ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీరగా ప్రసిద్ధి కెక్కింది.అవును, ఆ చీర ఖరీదు రూ.40 లక్షలు ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
ఈ చీర బంగారు జరీ వర్క్ తో తయారవడం వలన అంత ఖరీదు అని చెబుతూ వుంటారు.అంతేకాకుండా బ్లౌజ్ పై ఖరీదైన పెయింటింగ్ డిజైన్ను ఉంది.ఈ చీరను చెన్నై సిల్క్స్ డైరెక్టర్ శివలింగం డిజైన్ చేసినట్టు భోగట్టా.
ఎంబ్రాయిడరీకి ప్రసిద్ధి చెందిన కంచి సిల్క్ కి సంబందించిన బంగారు లేస్లు ఈ చీరను నేతనేయడంలో వాడారు.ఈ చీర పచ్చ, కెంపు, పుష్యరాగం, ముత్యాలు పొదిగిన రాళ్లతో దృష్టిని ఆకర్షించేలా తయారు చేయడం విశేషం.ఈ చీర నేయడానికి కాంచీపురానికి చెందిన 36 మంది కళాకారులు కలిసి పనిచేసినట్లు చెబుతారు.కాగా ఈ చీర నేయడానికి దాదాపు ఓ సంవత్సర కాలం పట్టిందని భోగట్టా.నీతా అంబానీ, పరిమళ్ నత్వానీ కుమారుడి వివాహానికి రూ.40 లక్షల గులాబీ రంగు చీరను ధరించారు.ఈ పెళ్లికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరయ్యారు.