నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కోటంరెడ్డి హంగామా కేవలం పబ్లిసిటీ కోసమేనని విమర్శించారు.
నాలుగేళ్ల నుంచి కోటంరెడ్డికి ప్రజా సమస్యలు గుర్తుకు రాలేదా అని మంత్రి కాకాణి ప్రశ్నించారు.పార్టీ నుంచి దూరం అయినప్పుడే గుర్తుకు వచ్చాయా అని నిలదీశారు.
ప్రజా సమస్యలు ఉంటే ఈ గడిచిన నాలుగేళ్ల కాలంలో సీఎం జగన్ దృష్టికి ఎందుకు తీసుకురాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.