ఏపీ రాజధాని వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు క్యాపిటల్ పై ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ పిటిషన్ విచారణను మార్చి 28కి వాయిదా వేసింది.
అయితే సుప్రీం తీర్పుపై ఏపీ రాజధాని అమరావతినా లేదా మూడు రాజధానులా అనే విషయం ఆధారపడి ఉన్న సంగతి తెలిసిందే.
మూడు రాజధానుల అంశంపై ధర్మాసనం నుంచి క్లియరెన్స్ వస్తుందని ఏపీ ప్రభుత్వం ఆశిస్తోంది.అందుకు తగినట్లుగా సీఎం జగన్ సహా మంత్రులు విశాఖ నుంచి పరిపాలన చేపట్టనున్నామని ప్రకటనలు చేస్తున్నారు.
దీంతో రాజధానుల అంశంపై సుప్రీం ఇవ్వనున్న తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.