బావను ఇద్దరు వ్యక్తుల సహాయంతో అతి కిరాతకంగా చంపడం తో మహబూబ్ నగర్ జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి.జిల్లాలోని డోర్నకల్ శివారు ప్రాంతంలో ఉన్న మున్నేరు వాగుకు కూతవేటు దూరంలో ఒక కుళ్ళిన స్థితిలో గుర్తుతెలియని మృతదేహం సోమవారం లభ్యమైంది.
డోర్నకల్ నగర శివారులోని సిగ్నల్ తాండాకు చెందిన బానోత్ జగన్ (30) ఈనెల రెండవ తేదీన అదృశ్యమయ్యాడు.
కాస్త వివరాల్లోకెళ్తే ఇంకా వివాహం కాని జగన్ హైదరాబాదు లో క్యాటరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
జగన్ సోదరుడు గోపి అనారోగ్యంతో ఆరేళ్ల క్రితం చనిపోయాడు.గోపి భార్య, ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ తాండా లో ఒంటరిగా జీవిస్తుంది.
అయితే ఈమె ప్రవర్తన సరిగా ఉండేది కాదు.మరదలి ప్రవర్తనను చూసి విసిగిపోయిన జగన్ తరచూ మరదలిని మందలించేవాడు.
ఈనెల 1వ తేదీ తాండాకు వచ్చిన జగన్ కనిపించకపోవడంతో తాండా వాసులు అతని మరదలు పై అనుమానంతో గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది.
తనను తన బావ ఎప్పుడు మందలించేవాడని, ఇంకా తన కోరిక తీర్చాలని చాలా సార్లు వేధించాడని తెలిపింది.ఎలాగైనా తన బావ జగన్ అడ్డు తొలగించుకోవాలని భావించి ఇద్దరు వ్యక్తుల సహాయం తీసుకున్నారని తెలిపింది.ఇక రెండవ తేదీ రాత్రి కోరిక తీరుస్తానని మున్నేరు శివారు శివాలయానికి జగన్ ను తీసుకువెళ్లాలని, తాను అక్కడికి చేరుకునే ముందే ఇద్దరు వ్యక్తులను ఆ ప్రాంతంలో ఉంచానని చెప్పింది.
వీరు ఆ ప్రాంతానికి చేరుకున్న వెంటనే వారు బండరాళ్లతో జగన్ తల, మెడపై దాడి చేసి చంపారని చెప్పింది.అసలు విషయం బయట పడడంతో తండావాసులు కోపంతో దేహశుద్ధి చేసి, మెడలో చెప్పుల దండ వేసి తాండ అంతట ఊరేగించారు.
తర్వాత ఆమెను స్థానిక పోలీసులకు అప్పగించారు.
.