దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ తన కస్టమర్ల కోసం అదిరిపోయే బెనిఫిట్స్ తీసుకొచ్చింది.ఎందుకోసం తాజాగా పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్తో చేతులు కలిపింది.
ఈ సంస్థ కొద్ది గంటల క్రితమే కస్టమర్ల కోసం కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను పరిచయం చేసింది.మొత్తంగా మూడు కొత్త క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తెచ్చింది.
అవే పీఎస్బీ ఎస్బీఐ కార్డు ఎలైట్, పీఎస్బీ ఎస్బీఐ కార్డు ప్రైమ్, పీఎస్బీ సింప్లీ సేవ్ ఎస్బీఐ కార్డు.పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ కస్టమర్లను తమ కార్డు తీసుకుని ఎలా ప్రోత్సహించేందుకు వీటిని ఎస్బీఐ లాంచ్ చేసింది.
పీఎస్బీ ఎస్బీఐ కార్డు ఎలైట్, పీఎస్బీ ఎస్బీఐ కార్డు ప్రైమ్ అనేవి ప్రీమియం కార్డ్స్ కాగా వీటి ద్వారా అనేక ప్రయోజనాలు అందుకోవచ్చు.పీఎస్బీ ఎస్బీఐ కార్డు ఎలైట్ జాయినింగ్ ఫీజు రూ.4,999, పీఎస్బీ ఎస్బీఐ కార్డు ప్రైమ్ జాయినింగ్ ఫీజు రూ.2,999గా ఉంది.ఇక పీఎస్బీ సింప్లీ సేవ్ ఎస్బీఐ కార్డు ఫీజు కేవలం రూ.499యే కావడం విశేషం.అయితే కొనుగోలుదారులు వీటికి అదనంగా ట్యాక్స్లు కట్టుకోవాలి.
సింప్లీ సేవ్ కార్డు రూపే ప్లాట్ఫామ్ ద్వారా తీసుకోవచ్చు.మిగతా రెండు కార్డులు వీసా ప్లాట్ఫామ్ ద్వారా పొందొచ్చు.సింప్లీ సేవ్ కార్డు కొనుగోలు చేసిన వారు 60 రోజుల్లో రూ.2 వేలు ఖర్చు చేయడం ద్వారా 2 వేల రివార్డు పాయింట్లు సొంతం చేసుకోవచ్చు.ఒక ఏడాది కాలంలో రూ.1 లక్ష లేదా ఆపైన ఖర్చు చేస్తే ఫీజు మినహాయింపు లభిస్తుంది.