అదేంటి? పాత TVలను స్మార్ట్ TVగా మార్చే వీలు వుంటుందా? అని ఆశ్చర్య పోవద్దు.ఈ కధనం పూర్తిగా చదివితే మీకే అర్ధం అవుతుంది.
అది కూడా Airtel కస్టమర్లకు మాత్రమే ఈ సదవకాశం.అవును, సాధారణ TVలను కేవలం రూ.1500లకే స్మార్ట్ TVలుగా మార్చుకునే అవకాశాన్ని ఇపుడు Airtel అందిస్తోంది.Airtel ఎక్స్ట్రీమ్ బాక్స్ ద్వారా పాత TVని స్మార్ట్ TVగా మార్చుకునే అవకాశాన్ని ఇపుడు తన వినియోగదారులకు కల్పిస్తోంది.
కుటుంబ సమేతంగా TV చూసే వారిని దృష్టిలో పెట్టుకొని ఈ ఆఫర్ ప్రకటించడం కొసమెరుపు.
ఇకపోతే నేడు OTTల హవా కొనసాగుతున్నవేళ, ఆ అవకాశం లేని వారికి స్మార్ట్ వినోదం పరిచయం చేసేందుకు ఈ ప్లాన్ చేసిందని నిపుణులు చెబుతున్నారు.
అంటే Airtel ఎక్స్ట్రీమ్ బాక్స్.పాత TVలలోనే నేరుగా OTT కంటెంట్ను ప్రసారం చేసే మాస్టర్ ప్లాన్ వేస్తోంది.ఇకపోతే ఎక్స్ట్రీమ్ బాక్స్ అసలు ధర రూ.2,650 కాగా వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని కేవలం రూ.1500లకే అందిస్తోంది.ఈ ఎక్స్ట్రీమ్ సెటప్ బాక్స్ ద్వారా.
సోనీ లివ్, అమెజాన్ ప్రైమ్, ఈరోస్ నౌ, డిస్నీ+ హాట్స్టార్ వంటి అనేక ఓటీటీ ప్లాట్ఫామ్లోని కంటెంట్ను చూడవచ్చు.
అంతేకాకుండా ఈ ఫీచర్లతో పాటు.ఈ సెటప్ బాక్స్ 4కే రిజల్యూషన్ కంటెంట్ను కూడా అందిస్తుంది.కావలసినవారు ఈ బాక్స్ను కంపెనీ వెబ్సైట్ నుంచి నేరుగా ఆర్డర్ చేసుకోండి.
లేదా దగ్గర్లోని ఎయిర్టెల్ రిటైల్ స్టోర్కు వెళ్లినా.ఈ సెటప్ బాక్స్ అందుబాటులో ఉంటుందని సదరు యాజమాన్యం చెబుతోంది.కాగా, ఇలాంటి ఫీచర్లతోనే మార్కెట్లో మరో సెటప్ బాక్స్ అందుబాటులో ఉంది.‘టాటా ప్లే బింజ్+’ పేరుతో టాటా స్కై కంపెనీ ఇలాంటి ఓటీటీ సెటప్ బాక్స్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.ఇకపోతే Airtel ఎక్స్ట్రీమ్ బాక్స్ 5000కు పైగా యాప్స్కు సపోర్ట్ చేస్తుందని చెబుతున్నారు.