దేశంలో మరోసారి కరోనా కలకలం సృష్టిస్తుంది.తగ్గినట్టే తగ్గినటువంటి ఈ మహమ్మారి తిరిగి తన పంజా విసరడంతో ఇప్పటికే పలు రాష్ట్రాలలో కరోనా కేసులో నమోదు అవుతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అలర్ట్ అయ్యాయి.
ఈ క్రమంలోనే ఇతర దేశాల నుంచి వచ్చే వారికి తప్పనిసరిగా కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆంక్షలు జారీ చేసింది.ఇలా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కరోనా సమయంలో ఆపద్బాంధవుడుగా నిలిచినటువంటి సోనుసూద్ కూడా ఆప్రమత్తమయ్యారు.
గతంలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో సోనుసూద్ చేసిన సేవలు ప్రతి ఒక్కరికి తెలిసిందే.ఈ విధంగా కరోనా సమయంలో ఎంతోమందికి సహాయం చేసినటువంటి సోను సూద్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈయన కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… కరోనా తిరిగి వచ్చింది.
జాగ్రత్తగా ఉండండి.అసలు భయపడకండి ఏదైనా సమస్య ఉంటే నన్ను సంప్రదించండి.నా పాత నెంబర్ పనిచేస్తుంది.సహాయం కావాలంటే సంప్రదించండి అంటూ ఈయన ట్వీట్ చేశారు.
ఎన్నో సినిమాలలో విలన్ గా నటించి ఎందరినో భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సోను సూద్ నిజ జీవితంలో మాత్రం హీరో అనిపించుకున్నారు.కరోనా వంటి భయంకరమైన సమయంలో నిష్పక్షపాతంగా చేసిన సేవలకు గాను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చేతులు మీదగా ‘నేషన్స్ ప్రైడ్’ అవార్డును సోనూ ఇటీవల అందుకున్నాడు.అయితే మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేనున్నా అంటూ సోనూ సూద్ ముందుకు రావడంతో మరోసారి తన మానవత్వం చాటుకున్నారు.