టాలీవుడ్ సీనియర్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ప్రెజెంట్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు.ఒకప్పుడు వీరికి తోడుగా మరొక ఇద్దరు సీనియర్ హీరోలు పోటీ పడి మరీ సినిమాలు రిలీజ్ చేసేవారు.
వారెవరో ఇప్పటికే అర్ధం అయ్యి ఉంటుందిగా.బాలకృష్ణ.
చిరంజీవి.వెంకటేష్.
నాగార్జున.ఈ నలుగురు ఒకప్పుడు భారీ సినిమాలను పోటాపోటీగా నిలిపేవారు.ఫ్యాన్స్ కూడా తమ హీరోలకు భారీ మద్దతు తెలిపేవారు.
అయితే ఇప్పుడు చుస్తే సీన్ మొత్తం రివర్స్ అనే చెప్పాలి. నాగార్జున.వెంకటేష్ సైలెంట్ గా మారిపోతే చిరు,బాలయ్య మాత్రం ఇప్పటికి వరుస సినిమాలు చేస్తూ తమ హవా కొనసాగిస్తున్న సూపర్ హిట్స్ కూడా అందుకుంటున్నారు.
ఇలా చిరు, బాలయ్య ఒకటి కాదు రెండు కాదు వరుసగా సినిమాలు ప్రకటిస్తూ వాటిని పూర్తి కూడా చేస్తున్నారు.
కానీ నాగ్, వెంకీలు మాత్రం అంత జోష్ గా సినిమాలు చేయడం లేదు.
కరోనా తర్వాత వీరి జోరు మరింత తగ్గింది అనే చెప్పాలి.వెంకటేష్ చేసిన ఎఫ్ 3 మాత్రమే కరోనా తర్వాత రిలీజ్ అయ్యింది.
ఈ సినిమాతో పర్వాలేదు అనిపించాడు.ఇక నాగ్ ఇటీవలే నటించిన ఘోస్ట్ రిలీజ్ అయ్యి అట్టర్ ప్లాప్ అయ్యింది.
ఇలా ఈ ఇద్దరు హీరోల మార్కెట్ పరంగా కూడా అనుకూలంగా లేదు.మరి ఈ ఇద్దరు హీరోలు నెమ్మదిగా సినిమాలు తగ్గించి బిజినెస్ లలో బిజీ అయ్యారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.సొంత వ్యాపారంతో బిజీగా ఉంటూనే వీరికి నచ్చిన కథలకు మాత్రమే ఓకే చెబుతున్నారట.లేకపోతే వీరు సినిమాలను లైట్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.మరి ఇదే కొనసాగితే ముందు ముందు వీరి నుండి సినిమాలు తగ్గే అవకాశం ఉంది.