బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది.రాగల 24 గంటల్లో మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ వాయుగుండం చెన్నైకి 450 కిలోమీటర్లు, మచిలీపట్నంకు 580 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది.దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉంది.
వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.