అధిక బరువు.ప్రస్తుత రోజుల్లో కోట్లాది మందికి అతి పెద్ద శత్రువు ఇది.
రోజు అద్దంలో తమను చూసుకుంటూ లావుగా ఉన్నామని చాలా మంది లోలోన తీవ్రంగా మదన పడుతూ ఉంటారు.ఈ క్రమంలోనే బరువు తగ్గడం కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అధిక బరువుతో అస్సలు చింతించకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను రోజు మార్నింగ్ తీసుకుంటే ఎంత లావుగా ఉన్నవారు అయినా సరే మల్లె తీగల మారడం ఖాయం.
మరి ఇంకెందుకు ఆలస్యం వెయిట్ లాస్కు ఉపయోగపడే ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేసేయండి.ముందు రెండు నిమ్మ పండ్లు తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా కడగాలి.ఇలా కడిగిన నిమ్మ పండ్లను సగానికి కట్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు జ్యూస్ తొలగించిన నిమ్మ తొక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో నిమ్మ ముక్కలు, హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పొడి వేసుకుని పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.అనంతరం వాటర్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసి మిక్స్ చేసుకొని ఉదయాన్నే ఖాళీ కడుపుతో సేవించాలి.ప్రతిరోజు ఈ డ్రింక్ ను తీసుకుంటే కనుక ఎంత లావుగా ఉన్నవారు అయినా సరే కొద్ది రోజుల్లోనే సన్నగా మారతారు.అలాగే ఈ డ్రింక్ను తీసుకోవడం వల్ల మెదడు పని తీరు చురుగ్గా మారుతుంది.మార్నింగ్ సిక్ నెస్, హ్యాంగోవర్ వంటి వాటి నుంచి సైతం చాలా త్వరగా బయటపడతారు.