ఎప్పటి నుండో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో మేజర్ ఒకటి.ఈ సినిమాను మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ అయినా జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ తో కలిపి నిర్మించాడు.
మహేష్ బాబు ఈ సినిమాలో భాగం కావడంతో ముందు నుండి మహేష్ అభిమానులు సైతం ఈ సినిమాపై ద్రుష్టి పెట్టారు.అయితే ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది.
కానీ కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది.ఈ సినిమాలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ హీరోగా నటించాడు.రియల్ ఇండియన్ ఆర్మీ హీరో సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.వాస్తవ సంఘటనలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి పాన్ ఇండియా సినిమాగా దీనిని తెరకెక్కించారు.
శశి కిరణ్ తిక్క దర్వకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదల అయ్యేందుకు రెడీ అయ్యింది.ఈ నెల 27న మేజర్ సినిమా రిలీజ్ కాబోతుంది.దీంతో మేకర్స్ ఇప్పటి నుండే ప్రొమోషన్స్ స్టార్ట్ చేసారు.
ఈ క్రమంలోనే ట్రైలర్ విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, గ్లిమ్స్, టీజర్ రిలీజ్ చేయగా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.
పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేయబోతుండడం వల్ల ప్రొమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేయనున్నారు.ఈ సినిమా నుండి ట్రైలర్ ను మే 9న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.మరి ఈ ట్రైలర్ ఎలా ఉండబోతుందో చూడాలి.ఇందులో అడవి శేష్ కు జోడీగా శోభిత దూళిపాళ్ల, సయీ మంజ్రేకర్ నటిస్తున్నారు.మహేష్ నిర్మించిన ఈ సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలి.