'మేజర్' అప్డేట్.. మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ రాబోతుంది ఎప్పుడంటే?

ఎప్పటి నుండో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో మేజర్ ఒకటి.

ఈ సినిమాను మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ అయినా జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ తో కలిపి నిర్మించాడు.

మహేష్ బాబు ఈ సినిమాలో భాగం కావడంతో ముందు నుండి మహేష్ అభిమానులు సైతం ఈ సినిమాపై ద్రుష్టి పెట్టారు.

అయితే ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది.కానీ కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది.

ఈ సినిమాలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ హీరోగా నటించాడు.రియల్ ఇండియన్ ఆర్మీ హీరో సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.

వాస్తవ సంఘటనలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి పాన్ ఇండియా సినిమాగా దీనిని తెరకెక్కించారు.

శశి కిరణ్ తిక్క దర్వకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ""img Src=" Https://telugustop!--com/wp-content/uploads/2022/05/Ai-Sesh-Major!--jpg"/ ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదల అయ్యేందుకు రెడీ అయ్యింది.

ఈ నెల 27న మేజర్ సినిమా రిలీజ్ కాబోతుంది.దీంతో మేకర్స్ ఇప్పటి నుండే ప్రొమోషన్స్ స్టార్ట్ చేసారు.

ఈ క్రమంలోనే ట్రైలర్ విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, గ్లిమ్స్, టీజర్ రిలీజ్ చేయగా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.

""img Src=" Https://telugustop!--com/wp-content/uploads/2022/05/Date-Announcement-Ai-Sesh!--jpg"/ పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేయబోతుండడం వల్ల ప్రొమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేయనున్నారు.

ఈ సినిమా నుండి ట్రైలర్ ను మే 9న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

మరి ఈ ట్రైలర్ ఎలా ఉండబోతుందో చూడాలి.ఇందులో అడవి శేష్ కు జోడీగా శోభిత దూళిపాళ్ల, సయీ మంజ్రేకర్ నటిస్తున్నారు.

మహేష్ నిర్మించిన ఈ సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలి.

కొడుకు రాజమౌళికి భారీ షాకిస్తున్న విజయేంద్ర ప్రసాద్.. 450 కోట్ల బడ్జెట్ తో సినిమా తెరకెక్కించనున్నారా?