మెగా స్టార్ చిరంజీవి హీరోగా వరుసగా సినిమా లు రూపొందుతున్నాయి.ఆ సినిమా లు బాక్సాఫీస్ వద్దకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.
మొదటగా ఆచార్య సినిమా ఈ నెలలో విడుదల కాబోతుంది.ఆ తర్వాత ఆగస్టు లో గాడ్ ఫాదర్ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
ఆ తర్వాత భోళా శంకర్.ఆ తర్వాత వాల్తేరు వీరన్న… ఇలా వరుసగా సినిమా లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
భారీ అంచనాల నడుమ రూపొందిన ఆచార్య సినిమా నుండి మొదలుకుని పైన చెప్పిన ప్రతి ఒక్క సినిమా లో కూడా చిరంజీవి తో పాటు ఒక ప్రముఖ స్టార్ నటించడం జరిగింది.మెగా స్టార్ చిరంజీవి అంటే నే అతి పెద్ద స్టార్.
అలాంటి స్టార్ సినిమా లో గెస్ట్ రోల్స్ ను పెట్టి సినిమా కు స్టార్ డమ్ ను తీసుకు రావాల్సిన అవసరం ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఆచార్య సినిమా లో రామ్ చరణ్ నటించాడు.
ఇక లూసీఫర్ రీమేక్ అయిన గాడ్ ఫాదర్ సినిమా లో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో గెస్ట్ గా కనిపించబోతున్నాడు.ఇక వేదాళం రీమేక్ అయిన భోళా శంకర్ సినిమా లో కీలక పాత్ర లో కీర్తి సురేష్ కనిపించబోతుంది.
ఆమె హీరోయిన్ కాదు కాని చిరు కు సోదరిగా గెస్ట్ ను మించిన పాత్రలో కనిపించబోతుంది.ఇక వాల్తేరు వీరన్న సినిమా లో రవితేజ నటించబోతున్న విషయం తెల్సిందే.
ఇలా ప్రతి ఒక్క సినిమా లో కూడా గెస్ట్ లను నటింపజేయడం పట్ల ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది.ఈ విషయం లో చిరంజీవి ఏం అంటాడు అనేది చూడాలి.
మెగా సినిమా కి కూడా ఇలాంటి గెస్టు లతో కలరింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు
.