తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బండ్ల గణేష్ నటుడిగా, నిర్మాతగా, కమెడీయన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.
అంతేకాకుండా బండ్ల గణేష్ ఇటీవలే హీరోగా కూడా మారిన విషయం తెలిసిందే.బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కు ఎంత వీరాభిమానో అందరికీ తెలిసిందే.
ఏ విషయమైనా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు.బండ్ల గణేష్ కు సోషల్ మీడియాలో బాగానే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.
పవన్ కళ్యాణ్ అంటే బండ్ల గణేష్ కు పిచ్చి.
పవన్ సినిమా రిలీజ్ అవుతుంది అంతే ఆ సినిమా థియేటర్ దగ్గర, అలాగే ఫ్రీ రిలీజ్ వేడుకలలో బండ్ల గణేష్ హడావిడి ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికీ తెలిసిందే.
ఇక బండ్ల గణేష్ ఎక్కువగా సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే.అదే విధంగా తాను పెట్టే పోస్టులకు అభిమానులు పెట్టే మెసేజ్ లకు వెంట వెంటనే రిప్లై ఇస్తూ ఉంటాడు.
ఇదిలా ఉంటే తాజాగా బండ్ల గణేష్ సోషల్ మీడియాలో వేదికగా ఒక నెటిజన్ కు ఇచ్చిన రిప్లై తో ఇరుక్కున్నాడు.దీంతో వెంటనే నెటిజెన్స్ బండ్ల గణేష్ ఫైట్ ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.
అయితే బండ్ల గణేష్ కు దైవభక్తి అంటే ఎక్కువ అన్న విషయం తెలిసిందే.
మరీ ముఖ్యంగా శివునికి సంబంధించిన కొటేషన్లను పోస్టులను పెడుతూ ఉంటారు.ఈ నేపథ్యంలోనే తాజాగా బండ్ల గణేష్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొన్నాడు.ఇక తాను తిరుపతి లో ఉన్నట్టుగా బండ్ల గణేష్ తన ట్వీట్ లో పేర్కొన్నాడు.
ఇదే విషయంపై ఒక నెటిజన్ స్పందిస్తూ.తిరుమల అంటే అందరికీ గుర్తుకువచ్చేది లడ్డూ ప్రసాదం.
ఇక బండ్ల గణేష్ ట్వీట్ పై స్పందించిన ఒక అమ్మాయి లడ్డు కావాలి అని అడిగింది.
దీనితో బండ్లగణేష్ రియాక్ట్ అవుతూ తీసుకువస్తాను అంటూ రిప్లై ఇచ్చారు.ఇదే విషయంపై నెటిజన్స్ బండ్ల గణేష్ ని ఒక ఆట ఆడుకుంటూ.కేవలం ఆడవాళ్ళకే? మాకు లేదా? ఆడవాళ్లు అడిగితేనే తెస్తావా? అంటూ బండ్ల గణేష్ పై సెటైర్లు వేస్తున్నారు.ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే తిరుపతి కి వెళ్ళిన బండ్లగణేష్ గుండు చేయించుకున్నట్లు తెలుస్తోంది.మొత్తానికి గణేష్ ఈ లడ్డూ ట్వీట్ తో సోషల్ మీడియా లో బాగానే వైరల్ అయ్యాడు.ప్రస్తుతం బండ్ల గణేష్ గుండు తో కొత్త లుక్ తో కనిపిస్తున్నాడు.