టాలీవుడ్ లో ఉన్న సక్సెస్ ఫుల్ డైరక్టర్స్ లో ఒకరు వెంకీ కుడుముల.చేసిన రెండు సినిమాలతోనే అతను సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.
ఛలో, భీష్మ రెండు సినిమాలు రెండు సూపర్ హిట్లు కాగా రెండింటితో తన డైరక్షన్ టాలెంట్ చూపించి సూపర్ హిట్ అందుకున్నాడు వెంకీ కుడుముల.నేటితో భీష్మ సినిమా రిలీజై రెండేళ్లు అవుతున్న సందర్భంగా డైరక్టర్ వెంకీ కుడుముల ఓ ఎమోషనల్ మెసేజ్ చేశాడు.
ట్విట్టర్ లో భీష్మ సినిమా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వెంకీ కుడుముల స్పెషల్ మెసేజ్ పెట్టాడు.
మొదటి సినిమా సక్సెస్ కన్నా రెండో సినిమా సక్సెస్ చాలా ఇంపార్టెంట్ అని.ఇక్కడ నిలబడటానికి భీష్మ సినిమా కారణమని.నితిన్ అన్న తనకు సపోర్టింగ్ గా ఉన్నారని.
ఈ ప్రాజెక్ట్ తన మీద నమ్మకం ఉంచి సైన్ చేసినందుకు రష్మికకు థ్యాంక్స్ అని చెప్పారు వెంకీ కుడుముల.నిర్మాత వంశీ ఇక మిగతా కాస్ట్ అండ్ క్రూ కూడా తనకు సపోర్ట్ గా ఉన్నారని.
సినిమా సక్సెస్ లో మీరంతా భాగమైనందుకు సంతోషమని అన్నారు వెంకీ కుడుముల. ఇక తన వెంకీ కుడుముల తన థర్డ్ సినిమా మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న విషయం తెలిసిందే.