ప్రంపంచం మొత్తం ఇప్పుడు రెండు పేర్లు చెబితే భగ్గుమంటోంది.అందులో ఒకటి కరోనా అయితే ఇప్పుడు రెండోది తాలిబన్లు అనే చెప్పాలి.
ఎందుకంటే వీరు చేస్తున్న పనులు ఇప్పుడు ప్రపంచం మొత్తం వ్యతిరేకిస్తోంది.ఆఫ్గనిస్తాన్ దేశాన్ని వారు స్వాధీంన చేసుకున్న తర్వాత ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం.
ఇక వీరి పనులపై ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్నా కూడా వారి తీరులో మాత్రం మార్పు రావట్లేదు.మరి ఇలాంటి సందర్భంలో ఈ విషయంపై ఆచితూచి వ్యవహరించాల్సిన సెలబ్రిటీలు కూడా వింత మాటలు మాట్లాడుతున్నారు.
ఇక ఇప్పుడు అయితే తాలిబన్లను ఓ పాకిస్థాన్ క్రికెటర్ పొగడుతున్నారు.ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు ఎంతో సానుకూల దృక్పథంతో ముందుకొచ్చారని, ఆ దేశంలో వారు మహిళలకు కూడా పనులు చేసుకునే స్వేచ్ఛ ఇస్తున్నారంటూ చెప్పుకొచ్చారు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది.
అంతే కాదు తాలిబన్లు తమ క్రికెట్ను ఎంతో ఇష్టపడతారని కూడా ఆయన వ్యాఖ్యానించడంతో ఇప్పుడు ప్రజలు భగ్గుమంటున్నారు.ఇక సోషల్ మీడియాలో అయితే నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారనే చెప్పాలి.
ఓ వైపు తాలిబన్ల బాధలు తట్టుకోలేక ఆఫ్ఘనిస్తాన్ నుంచి లక్షల సంఖ్యలో మహిళలు, అలాగే ప్రజలు దేశం విడిచి పారిపోతున్న సమయంలో ఇలా ఎలా మాట్లాడుతారంటూ భగ్గుమంటున్నారు.ఇప్పుడు ఆ దేశంలో అఫ్గనిస్తాన్ ప్రజలు పడుతున్న అవస్థలు అంత స్పష్టంగా కనిపిస్తున్న తరుణంలో ఇలా ఎలా మాట్లాడుతారంటూ ఫైర్ అవుతున్నారు.తాలిబన్లు పైకి శాంతి మాటలు చెబుతూరనే ఇంకోవైపు మహిళలను దారుణంగా అణగదొక్కడం కనిపిస్తోందని కాబట్టి ఇలా మాట్లాడొద్దని నెటిజన్లు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇంకా చెప్పాలంటే ఆఫ్రిదిపై చాలామంది క్రికెటర్లు కూడా ఫైర్ అవుతున్నారంట.
మరి ఆయన ఎలాంటి రిప్లై ఇస్తారో వేచి చూడాలి.