ప్రస్తుతం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో యంగ్ హీరోలకు పోటీగా ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.పాన్ ఇండియా మూవీ ఆచార్య సినిమాలో బిజీగా ఉండగా ఈ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనుంది.
త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు.ఇక ఈ సినిమాతో పాటు మరిన్ని సినిమాలలో అవకాశాలు అందుకోగా అందులో ఓ సినిమాలో మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటించనున్నట్లు ఇండస్ట్రీలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.
మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత వరుసగా ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.అంతేకాకుండా ప్రస్తుతం పలు సినిమాలలో అవకాశాలు అందుకుని బిజీగా ఉంది.
పైగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటుంది.ఇదిలా ఉంటే ఇప్పటివరకు హీరోయిన్ గా మెప్పించిన కీర్తి సురేష్ త్వరలోనే తెరపై మెగాస్టార్ చెల్లెలుగా కనిపించనుంది.
ఆచార్య సినిమా పూర్తయిన వెంటనే చిరంజీవి మరో సినిమా లూసిఫర్ రీమేక్ లో నటించనున్నాడు.
ఇక ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నాడు.ఈ సినిమాతో పాటు తమిళంలో మంచి సక్సెస్ అందుకున్న వేదాళమ్ రీమేక్ లో కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నాడు చిరంజీవి.రమేష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రస్తుతం భారీ అంచనాలు వస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో చెల్లెలి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని.ఆ పాత్రతోనే కథ మలుపు ఉంటుందని తెలుస్తుంది.దీంతో చిరంజీవికి చెల్లెలుగా నటించేది ఎవరా అని చర్చలు కూడా జరుగాయట.దాంతో ఎక్కువగా కీర్తి సురేష్, సాయి పల్లవి పేర్లు వినిపించగా.కీర్తి సురేష్ అయితే చిరంజీవికి చెల్లిగా బాగుంటుందని భావించాడట డైరెక్టర్.దీంతో కీర్తి సురేష్ ను ఒప్పించాడాని పైగా రెమ్యూనరేషన్ కూడా అందుకుందని టాక్ వినిపిస్తుంది.
మొత్తానికి మెగాస్టార్ సరసన మంచి క్రేజీ ఉన్న పాత్రలో అవకాశం అందుకుంది కీర్తి సురేష్.