మానవుడు భూమి మీద తానే గొప్ప వాడినని అనుకుంటాడు.కాని అది నిజం కాదని చాలా సమయాల్లో మనకు రుజువయింది.
ఎందుకంటే జంతువులు మూగ జీవాలు అని చాలా తేలికగా తీసిపారేస్తాం.కాని వాటికి ఉండే అపారమైన టాలెంట్ మనుషులలో కూడా ఉండదు.
సహజంగా ఏ పని చేయాలో అది మనం ఇంకొకరిని అడిగో, లేకపోతే ఎవరైనా చేస్తుంటే చూసి నేర్చుకునే శక్తి మనకు ఉంటుంది.కాని అలా నేర్చుకోవడం జంతువులకు సాధ్యపడదు.
ఎందుకంటే మన ఆలోచనా సామర్థ్యం, జంతువుల ఆలోచనా సామర్థ్యానికి చాలా తేడా ఉంటుంది.వాటికి అసలు అలా చేయగలిగే సత్తా లేదని మనం ఖరాఖండీగా చెబుతాం.
కాని ఇక్కడే మనం పొరపాటు చేస్తున్నాం.అవును మనలాగే జంతువులు కూడా చేయగలవు.
ఏంటి నమ్మడం లేదా.సహజంగా మనకు దాహం వేస్తే బోరుపంపును కొట్టి దాహం తీర్చుకుంటాం.
కాని జంతువులైతే ఎవరో ఒకరు బోరుపంపును కొడితే అవి దాహం తీర్చుకుంటాయి.కాని మీరిప్పుడు చూడబోయే వీడియోను చూసి మీ అభిప్రాయం మార్చుకుంటారు.
ఒకవిధంగా చెప్పాలంటే ఆశ్చర్య పోతారు కూడా.ఓ ఏనుగు దాహం వేసిందని చెప్పి తనకుతానుగా బోరు పంపును కొట్టి దాహం తీర్చుకుంటోంది.
అలా తనకు దాహం తీరాక అక్కడి నుండి వెళ్లి పోయింది.అయితే ఈ వ్యవహారాన్ని గమనించిన అక్కడ కూర్చున్న వ్యక్తులు ఒక్కసారిగా ఆశ్చర్య పోయారు.
ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.మీకూ ఈ వీడియో చూడాలని ఉందా.ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి.