ప్రేమిస్తున్నానని ఓ మైనర్ బాలికను లోబర్చుకుని పలుమార్లు అత్యాచారం చేశాడు ఓ రాజకీయ నేత కొడుకు.ఇటీవల హైదరాబాద్ లో జరిగిన బోనాల ఉత్సవాల్లో ఓ బాలికతో పరిచయం పెంచుకుని ప్రేమగా మలుచుకున్నాడు.
బాలికను ఇంటికి పిలిపించుకున్నాడు.కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి అత్యాచారం చేశాడు.
మత్తు నుంచి బయటకు వచ్చిన అమ్మాయిని బెదిరించి బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించాడు.ఈ విషయం తల్లిదండ్రులకు తెలవడంతో అసలు విషయం బయట పడింది.
మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన హైదరాబాద్ లోని కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా చోటు చేసుకుంది.బోనాల ఉత్సవాల్లో ఓ మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు ఓ రాజకీయ నేత కుమారుడు రోషన్.
ప్రేమిస్తున్నానని నమ్మబలికి ఆమెను తన రూంకి రప్పించుకున్నాడు.కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి తాగించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
మత్తు నుంచి తేరుకున్నాక బాలికను బెదిరించడంతో కొద్ది రోజుల తర్వాత ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.దీంతో వాళ్లు కుల్సుంపురా పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు.
అయితే ఈ విషయం తెలిసి రోహన్ బాలిక కుటుంబాన్ని బెదిరించాడు.కేసు వాపస్ తీసుకోకపోతే అందరిని చంపేస్తానని హెచ్చరించాడు.
దీంతో బాలిక తల్లిదండ్రులు ఈ నెల 12వ తేదీన మరోసారి రోహన్ తో ప్రాణహాని ఉందని పేర్కొన్నారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.