సూపర్ స్టార్ మహేష్ బాబు నటించి తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు మరో రెండు రోజుల్లో మనముందుకు రానుంది.ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
మహేష్ ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కథ పట్ల ఇండస్ట్రీలో పలు వార్తలు షికారు చేస్తున్నాయి.
ఈ కథలో మహేష్ ఆర్మీ మేజర్ అని, అతడు రాయలసీమలో అడుగుపెట్టినప్పుడు ఇక్కడ ఫ్యాక్షన్ భూతం చూసి దాన్ని అంతమొందిస్తాడని సోషల్ మీడియాలో పుకారు వినిపిస్తుంది.
అందుకే కర్నూలు కొండారెడ్డి బురుజు సెట్ను భారీగా వేశారనేది పలు వెబ్సైట్లు రాసుకొచ్చాయి.ఈ విషయంపై దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించాడు.
ఈ వార్తలన్నీ కేవలం పుకార్లేనని ఆయన కొట్టిపారేశాడు.ఈ కథలో ఫ్యాక్షన్కు ఏమాత్రం చోటు లేదని ఆయన తెలిపారు.
ఇదొక దేశభక్తిని పెంపొందించే చిత్రమని, ఫ్యామిలీ ఎమోషన్స్ను ఎలివేట్ చేసే చిత్రమని ఆయన పేర్కొన్నారు.సినిమా చూసిన తరువాత ఈ చిత్రం కథ అందరికీ చాలా కొత్తదిగా అనిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
మహేష్, విజయశాంతిల మధ్య వచ్చే సీన్స్ అందరినీ ఆకట్టుకుంటాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.ఏదేమైనా సోషల్ మీడియాలో సరిలేరు నీకెవ్వరు కథ ఇదేనంటూ పలు పుకార్లు రావడంపై ఆయన పైవిధంగా స్పందించాడు.
ఇక సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.