ప్రభాస్ హీరోగా వచ్చిన సాహో చిత్రం మరోసారి ఇండియా వ్యాప్తంగా దుమ్మురేపింది.బాహుబలి స్థాయిలో సాహో కూడా ఉంటుందని చాలా మంది అనుకున్నారు.
కాని సినిమా అంతగా ఆడలేదు.అయినా కూడా వసూళ్ల విషయంలో బాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉన్నాయి.
అందుకే ప్రభాస్తో సినిమా చేస్తే భారీ వసూళ్లు ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.అందుకే చాలా మంది నిర్మాతలు ఆయనతో సినిమా నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
దిల్రాజు నిర్మాణంలో సినిమాలు చేసేందుకు చిన్న హీరోలు చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు.అలాగే పెద్ద హీరోలు కూడా తప్పకుండా అంటూ దిల్రాజుకు డేట్స్ ఇస్తూనే ఉన్నారు.అయితే ప్రభాస్ మాత్రం దిల్రాజుకు చిక్కడం లేదట.దిల్రాజు బ్యానర్లో ప్రభాస్ ఇప్పటికే మున్నా మరియు మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు చేశారు.రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఆ రెండు సినిమాలు ప్రభాస్కు మంచి పేరు తెచ్చాయి.
తమ బ్యానర్లో రెండు సినిమాలు చేసి సక్సెస్ అయ్యాం.మూడవ సినిమా చేసి హ్యాట్రిక్ కొడదాం అంటూ దిల్రాజు గత కొన్నాళ్లుగా ప్రభాస్ చుట్టు తిరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.కాని ప్రభాస్ మాత్రం ప్రస్తుతం జాన్ సినిమా తప్ప మరే సినిమా చర్చల్లో పాల్గొనడం లేదు.
జాన్ తర్వాత దిల్రాజుకు సరే అంటాడేమో చూడాలి.జాన్ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా కృష్ణంరాజు నిర్మించబోతున్నాడు.