ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం తో ఒక్కొక్కరుగా ఆ పార్టీ లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు.ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో చాలా మంది బీజేపీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు కూడా.
అయితే తాజాగా కామన్ వెల్త్ ఛాంపియన్ బబితా ఫోగట్ కూడా ఆ బీజేపీ లో చేరినట్లు తెలుస్తుంది.కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజుజు సమక్షంలో బబితా తో పాటు ఆమె తండ్రి మహావీర్ ఫోగట్ కూడా బీజేపీ తీర్ధం పుచ్చుకున్నట్లు తెలుస్తుంది.మరో రెండు నెలల్లో హర్యానాలో ఎన్నికల జరగనున్న ఈ తరుణంలో ఫోగట్ ఫ్యామిలీ బీజేపీలో చేరడం అనేది ఆ పార్టీకి కలిసొచ్చే అంశంగా విశ్లేషకులు భావిస్తున్నారు.2016 లో అమీర్ ఖాన్ మహావీర్ ఫోగట్ పాత్రలో అలరించిన దంగల్ చిత్రం తరువాత ఫోగట్ కుటుంబం మరింత పాపులర్ అయ్యింది.
![బీజేపీ లో చేరిన ఫోగట్ ఫ్యామిల� బీజేపీ లో చేరిన ఫోగట్ ఫ్యామిల�](https://telugustop.com/wp-content/uploads/2019/08/Wrestler-Babita-phogat-and-mahavir-phogat-joins-in-BJPparty.jpg)
అయితే ఒకరకంగా హర్యానా లో పాపులారిటీ ఉన్న ఆ కుటుంబం లోని ఇద్దరు వ్యక్తులు బీజేపీ పార్టీలో చేరడం ఆ పార్టీ కి అనుకూలాంశంగా చెప్పొచ్చు.అయితే మోదీ చేపట్టిన విధానాలు, స్కీమ్లు తమను ఆకట్టుకున్నట్లు మహావీర్ పోగట్ చెప్పారు.