ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో చిరంజీవి తరుపున ఎన్నికల ప్రచారానికి రామ్ చరణ్, అల్లు అర్జున్ తో పాటు నాగబాబు, అల్లు అరవింద్ తో మెగా ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగింది.అయితే ఈ సారి జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్ మళ్ళీ ప్రజల మధ్యకి వచ్చాడు.
ఈ సారి జనసేన పార్టీ తరుపున నాగబాబు కూడా ఎంపీగా పోటీ చేస్తున్నాడు.అతని గెలుపు మీద జనసేన భారీగా ఆశలు పెట్టుకుంది.
అయితే ఈ సారి జనసేన పార్టీ తరుపున ఎన్నికల ప్రచారానికి మెగా హీరోలు ఎవరు ముందుకి రాలేదు.
పవన్ కళ్యాణ్ కూడా మెగా హీరోలని తన పార్టీ తరుపున ప్రచారం చేయమని అడగలేదు.
దీంతో ఇప్పుడు మెగా హీరోలంతా సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు.అయితే మెగా ఫ్యామిలీ నుంచి మెగా డాటర్ నాగబాబు కూతురు ఎన్నికల ప్రచారంలోకి వచ్చింది.
భీమవరంలో నరసాపురం జనసేన ఎంపీ అభ్యర్థి తన తండ్రి నాగబాబు తరుపున నీహారిక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.భీమవరం రూరల్లోని యణదుర్రు, వెంప, తాడేరు, తుందుర్రుల్లో రోడ్షో నాగబాబుతో పాటు ఆమె కూడా పాల్గొని ప్రచారం నిర్వహించారు.
భీమవరంలో పవన్ కల్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని నాగబాబు అన్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని భారీ మెజార్టీతో భీమవరంలో గెలిపించాలని నిహారికా కోరారు.