జనసేన కోసం నిహారికా ప్రచారం! ఇక మెగా హీరోల వంతు!

ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో చిరంజీవి తరుపున ఎన్నికల ప్రచారానికి రామ్ చరణ్, అల్లు అర్జున్ తో పాటు నాగబాబు, అల్లు అరవింద్ తో మెగా ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగింది.అయితే ఈ సారి జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్ మళ్ళీ ప్రజల మధ్యకి వచ్చాడు.

 Niharika Campaign For Janasena Party-TeluguStop.com

ఈ సారి జనసేన పార్టీ తరుపున నాగబాబు కూడా ఎంపీగా పోటీ చేస్తున్నాడు.అతని గెలుపు మీద జనసేన భారీగా ఆశలు పెట్టుకుంది.

అయితే ఈ సారి జనసేన పార్టీ తరుపున ఎన్నికల ప్రచారానికి మెగా హీరోలు ఎవరు ముందుకి రాలేదు.

పవన్ కళ్యాణ్ కూడా మెగా హీరోలని తన పార్టీ తరుపున ప్రచారం చేయమని అడగలేదు.

దీంతో ఇప్పుడు మెగా హీరోలంతా సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు.అయితే మెగా ఫ్యామిలీ నుంచి మెగా డాటర్ నాగబాబు కూతురు ఎన్నికల ప్రచారంలోకి వచ్చింది.

భీమవరంలో నరసాపురం జనసేన ఎంపీ అభ్యర్థి తన తండ్రి నాగబాబు తరుపున నీహారిక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.భీమవరం రూరల్‌లోని యణదుర్రు, వెంప, తాడేరు, తుందుర్రుల్లో రోడ్‌షో నాగబాబుతో పాటు ఆమె కూడా పాల్గొని ప్రచారం నిర్వహించారు.

భీమవరంలో పవన్ కల్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని నాగబాబు అన్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని భారీ మెజార్టీతో భీమవరంలో గెలిపించాలని నిహారికా కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube