మహేష్‌, నాగ్‌ల మల్టీస్టారర్‌!

గత సంవత్సరం మహేష్‌బాబు, నాగార్జునల కాంబినేషన్‌లో తమిళ దర్శకుడు మణిరత్నం ఒక సినిమా ప్లాన్‌ చేస్తున్నాడు అంటూ ప్రచారం జరిగింది.ఇద్దరు హీరోలు కూడా మొదట ఈ భారీ మల్టీస్టారర్‌ సినిమాలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

 Aishwarya Rai Confirmed Movie With Maniratnam-TeluguStop.com

అయితే కొన్ని కారణాల వల్ల మహేష్‌ బాబు మొదట ఈ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకున్నాడు, ఆ తర్వాత నాగార్జున సైతం వైదొలుగుతున్నట్లుగా దర్శకుడు మణిరత్నంతో చెప్పాడు.దాంతో ఈ మల్టీస్టారర్‌ సినిమాకు ఆదిలోనే ఆగిపోయిందని అంతా భావించారు.

ఇద్దరు స్టార్‌ హీరోల మల్టీస్టారర్‌ వస్తుందని ఆశ పడ్డ ప్రేక్షకులకు నిరాశే మిగిలింది.

ఈ మల్టీస్టారర్‌ సినిమా గురించి మళ్లీ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఈ మల్టీస్టారర్‌ మూవీ అనుకున్న సమయంలో ఈ సినిమాలో హీరోయిన్‌గా ఐశ్వర్యరాయ్‌ను మణిశర్మ అనుకున్నాడు.ఆమెతో చర్చలు జరిపాడు, అందుకు ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చింది.

తాజాగా ఆ వివరాలను ఐశ్వర్య రాయ్‌ తెలుపుతూ.తాను గత సంవత్సరం మణిరత్నం సినిమాతోనే రీ ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది.

కాని కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యం అయ్యింది.మళ్లీ ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి అంటూ చెప్పుకొచ్చింది.

దాంతో మహేష్‌బాబు, నాగార్జునల మల్టీస్టారర్‌ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.నాగార్జునకు జతగా ఐశ్వర్యరాయ్‌, మహేష్‌బాబుకు జతగా శృతిహాసన్‌లు నటించనున్నారట.

ఈ సినిమా తెలుగు మరియు తమిళంలో ఒకే సమయంలో తెరకెక్కించేందుకు మణిరత్నం ప్రయత్నాలు చేస్తున్నాడు.మణిరత్నం తాజాగా తెరకెక్కించిన ‘ఓకే బంగారం’ సక్సెస్‌ అవ్వడంతో మళ్లీ ఈ మల్టీస్టారర్‌ సినిమా సెట్స్‌ పైకి వెళ్లబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube