గత సంవత్సరం మహేష్బాబు, నాగార్జునల కాంబినేషన్లో తమిళ దర్శకుడు మణిరత్నం ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు అంటూ ప్రచారం జరిగింది.ఇద్దరు హీరోలు కూడా మొదట ఈ భారీ మల్టీస్టారర్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అయితే కొన్ని కారణాల వల్ల మహేష్ బాబు మొదట ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు, ఆ తర్వాత నాగార్జున సైతం వైదొలుగుతున్నట్లుగా దర్శకుడు మణిరత్నంతో చెప్పాడు.దాంతో ఈ మల్టీస్టారర్ సినిమాకు ఆదిలోనే ఆగిపోయిందని అంతా భావించారు.
ఇద్దరు స్టార్ హీరోల మల్టీస్టారర్ వస్తుందని ఆశ పడ్డ ప్రేక్షకులకు నిరాశే మిగిలింది.
ఈ మల్టీస్టారర్ సినిమా గురించి మళ్లీ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈ మల్టీస్టారర్ మూవీ అనుకున్న సమయంలో ఈ సినిమాలో హీరోయిన్గా ఐశ్వర్యరాయ్ను మణిశర్మ అనుకున్నాడు.ఆమెతో చర్చలు జరిపాడు, అందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది.
తాజాగా ఆ వివరాలను ఐశ్వర్య రాయ్ తెలుపుతూ.తాను గత సంవత్సరం మణిరత్నం సినిమాతోనే రీ ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది.
కాని కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యం అయ్యింది.మళ్లీ ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి అంటూ చెప్పుకొచ్చింది.
దాంతో మహేష్బాబు, నాగార్జునల మల్టీస్టారర్ మూవీ త్వరలోనే సెట్స్పైకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.నాగార్జునకు జతగా ఐశ్వర్యరాయ్, మహేష్బాబుకు జతగా శృతిహాసన్లు నటించనున్నారట.
ఈ సినిమా తెలుగు మరియు తమిళంలో ఒకే సమయంలో తెరకెక్కించేందుకు మణిరత్నం ప్రయత్నాలు చేస్తున్నాడు.మణిరత్నం తాజాగా తెరకెక్కించిన ‘ఓకే బంగారం’ సక్సెస్ అవ్వడంతో మళ్లీ ఈ మల్టీస్టారర్ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది.