“కొంతమంది ఇంటిపేరు కాదురా గాంధీ, ఊరికొక్క వీధి పేరు గాంధీ.భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ.
తరతరాల యతయాతన తీర్చిన వరదాతర గాంధీ” అన్నారు దిగ్గజ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి.ఈరోజు అక్టోబర్ 2, అంటే గాంధీ జయంతి.
ఈ సందర్భంగా చాల తక్కువ మంది కి తెెలిసిన ఆయన జీవిిితంలోని 12 విషయాలు.
* గాంధీ బ్రిటీష్ సైన్యంలో కొన్నిరోజులు పనిచేసారు.
అవును, ఆయన దక్షిణాఫ్రికా లో ఉన్నప్పుడు బ్రిటీష్ సైన్యంలో గాయపడిన వారిని మోసే స్ట్రెచర్ మ్యాన్ గా పనిచేసారు.
* సౌత్ ఆఫ్రికాలో ఉంటున్న సమయంలోనే గాంధీ రెండు ఫుట్ బాల్ క్లబ్స్ ని ప్రారంభించారు.
* మహాత్మా రోజుకి సగటున 18 కిలోమీటర్లు నడిచేవారట.ఇలా ఆయన 40 ఏళ్ళకు పైగా నడిచారు.
* 1921 నుంచి గాంధీ కేవలం ధోతి ధరించడం మొదలుపెట్టారు.అందుకు కారణం మధురైలో ఆయన బట్టలు కూడా లేకుండా ఎంతోమంది పేదవారిని చూడటం.
* గాంధీ శాకహారి.పాలు కొన్ని సంవత్సరాలు తాగకపోయినా, ఆ తరువాత ఆరోగ్య కారణాలరీత్య మేకపాలు తాగేవారు.
ఆవు పాలు, బర్రె పాలు తాగేవారు కాదు.
* గాంధీ ఒకసారి కాదు ఏకంగా అయిదు సార్లు నోబెల్ శాంతి పురస్కరానికి నామినేట్ అయ్యారు.
కాని ఒక్కసారి కూడా ఆయన్ని ఆ బిరుదు వరించలేదు.నమ్మండి .ఇది నిజం.
* భారతదేశం బయట, ప్రపంచ నలుమూలల 48 పెద్ద నగరాల వీధులకు గాంధీ పేరుని పెట్టడం విశేషం.
* ఎడ్వీన్ ఆర్నాల్డ్ అనే పరదేశియుడు పరిచయం అయ్యేదాకా గాంధీ భగవద్గీత చదవకపోవడం విచిత్రం.గీతాపఠనం ఆయన జీవితాన్నే మార్చేసింది.ఎప్పుడు మానసిక సమస్యలు ఎదురైనా, కష్టాలు కనిపించినా, ఆయన భగవద్గీత చదివేవారు.
* ఆయనకి మహాత్మా అనే బిరుదుని రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చారు.
ఇక జాతిపితగా మొదటిసారి పిలిచింది జవహర్ లాల్ నెహ్రూ.
* భారత దేశానికి స్వతంత్రం లభించి, నెహ్రూ ప్రసంగం ఇస్తున్న సమయంలో గాంధీ అక్కడ లేరు.
బెంగాల్ లో మత అల్లర్లను చల్లార్చేందుకు అక్కడే శాంతియూతంగా పోరాటం చేస్తున్నారు.