భర్త నిత్యం గొడవపడుతున్నాడని భార్య సలసలా కాగే నూనెని...

ప్రస్తుత కాలంలో కొందరు క్షణికావేశలో విషయాలు తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా తమ అనుకునే కుటుంబ సభ్యుల జీవితాల్లో తీవ్ర విషాదం నింపుతున్నారు.తాజాగా ఓ మహిళ తనతో తన భర్త తరచు గొడవపడుతున్నాడనే కారణంగా అతడు నిద్రపోతున్న సమయంలో సలసలా కాగుతున్న నూనెను తీసుకువచ్చి అతని మొహంపై పోసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.

 Crime News, Guntur News, Wife Murder Attempt, Guntur Latest News, Cooking Oil,-TeluguStop.com

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకు చెందినటువంటి ఓ గ్రామంలో ఓ వ్యక్తి తన భార్య మరియు కుటుంబసభ్యులతో కలిసి నివాసముంటున్నాడు.అయితే పెళ్లైన కొత్తలో వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.ఏమైందో ఏమో గాని ఈ మధ్యకాలంలో ఇద్దరు దంపతులు తరచూ గొడవ పడుతూ ఉండేవారు.ఈ గొడవల కారణంగా భర్త తన భార్యను తరచూ చిత్రహింసలకు గురి చేస్తుండేవాడు.

దీంతో అతనిపై కక్ష పెంచుకున్న వివాహిత అతనిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని పన్నాగం పన్నింది.

ఇందులో భాగంగా అందరూ నిద్రిస్తున్న సమయంలో వంటలకు ఉపయోగించేటువంటి నూనెను బాగా మరిగించి వేడివేడి నూనెను తన భర్త మొహం పై పోసింది.

దీంతో నొప్పి బాధలు తాళలేక అతడు గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టాడు.ఆ కేకలు విన్నటువంటి చుట్టుపక్కల వారు వచ్చి నొప్పితో విలవిలలాడుతున్న బాధితుడిని చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆస్పత్రికి తరలించారు.

అలాగే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube