రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన కొత్త నిర్ణయంతో టాలీవుడ్ దర్శక నిర్మాతలకు షాక్ ఇస్తున్నాడు.ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో లైగర్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత తన దగ్గరకు వచ్చే డైరక్టర్స్ కు పాన్ ఇండియా సినిమా అయితేనే వర్క్ అవుట్ చేద్దామని చెబుతున్నాడట.లైగర్ తో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్న విజయ్ దేవరకొండ ఇక మీదట చేస్తే పాన్ ఇండియా సినిమాలనే చేయాలని ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది.
అసలైతే లైగర్ తర్వాత నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ డైరక్షన్ లో విజయ్ ఒక సినిమా చేయాల్సి ఉంది.విజయ్ మాత్రం శివ ని కూడా పాన్ ఇండియా కథ రెడీ చేయమని చెప్పాడట.
తన సినిమాలన్ని తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండేలా చేసే శివ నిర్వాణ పాన్ ఇండియా రేంజ్ సినిమా చేస్తాడా లేదా అన్నది చూడాలి.విజయ్ దేవరకొండ సుకుమార్ డైరక్షన్ లో కూడా ఒక సినిమా చేస్తాడని తెలుస్తుంది.
ఆ సినిమా మాత్రం పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవుతుందని అంటున్నారు. విజయ్ తీసుకున్న ఈ డెశిషన్ నిజంగానే అందరికి షాక్ ఇస్తుందని చెప్పొచ్చు
.