బౌల‌ర్ సిరాజ్‌పై బంతితో దాడి చేసిన ఇంగ్లాండ్ క్రికెట్ ఫ్యాన్స్‌.. భ‌గ్గుమంటున్న ఇండియ‌న్ ఫ్యాన్స్‌

క్రికెట్ అంటే మ‌న దేశంలో ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.ఇక ఇంగ్లాండ్ లోకూడా క్రికెట్‌కు ఇదే స్థాయిలో క్రేజ్ ఉంది.

ఇక ఇప్పుడు ఇండియా టీమ్ అలాగే ఇంగ్లండ్ టీమ్ క‌లిసి టెస్ట్‌ సిరీస్‌లో త‌ల‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే.కాగా ఇంగ్లండ్‌ అభిమానులు గ్రౌండ్లో చేసిన ప‌ని ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

ఎందుకంటే వారి అభిమానం అనేది హ‌ద్దులు దాటేసి భారత ఆటగాళ్లను టార్గెట్ గా ఏకంగా దాడులకు తెగ‌బ‌డుతున్నారు.దీంతో ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి.

ఇప్పుడు ఆడుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ స‌మ‌యంలో మొన్న‌టికి మొన్న స్టార్ బ్యాట్స్ మెన్ అయిన కేఎల్ రాహుల్ మీద‌ వాటర్‌ బాటిల్ మూతలను ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానులు విసిరిన సంగ‌తి అంద‌రికీ విదిత‌మే.కాగా ఈ దారుణ‌మైన ఘటన మర్చిపోక ముందే ఇప్పుడు మ‌రో భార‌త ఆట‌గాడిపై ఇదే విధంగా చేశారు.

Advertisement

ఇక ఇప్పుడు మూడో టెస్టు ఫ‌స్ట్ డే నాడు హైద‌రాబాద్ బౌల‌ర్ సిరాజ్‌ను టార్గెట్ గా చేసుకుని ఇంగ్లండ్ ఫ్యాన్స్ అంద‌రూ కూడా రెచ్చిపోతున్నారు.అయితే ఈరోజు మాత్రం ఓ అభిమాని ఏకంగా సిరాజ్ పైకి బంతిని విసిరాడు.

ఇక ఆ అభిమాని చేసిన ప‌ని చూసిన కెప్టెన్ కోహ్లి తీవ్ర అసహనం తెలిపాడు.ఇక కోహ్లీ అస‌లే దూకుడుకు మారు పేరు.ఆయ‌న ఊరుకుంటారా ఇంకేముంది ఆ బంతిని కాస్తా విసిరిన అత‌డి మీద‌కు తిరిగి విసరాలని సిరాజ్‌కు సైగ చేశాడు మ‌న ఫైర్ బ్రాండ్ విరాట్‌.

అయితే ఇలా సిరాజ్ మీద‌కు బంతిని విసిరిన మ్యాట‌ర్‌ను వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్ మ్యాచ్ త‌ర్వాత మీడియా సమావేశంలో చెప్ప‌డం సంచ‌ల‌నం రేపుతోంది.ఇక ఆ బంతి విసిరిన అభిమాని కాస్తా సిరాజ్‌ను గేలి చేసేందుకు కూడా ట్రై చేశాడంట‌.

ఇక అత‌గాడికి సిరాజ్ కూడా త‌న వేలు చూపిస్తూ గెలిచిన మ్యాచ్ లిస్టును సిగ్న‌ల్‌గా చూపించాడు.ఇంకేముంది అత‌గాడికి కాస్తా కౌంట‌ర్ ప‌డిపోయింది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు