మహాభారతం ప్రకారం అశ్వత్థామ ద్రోణాచార్యుడి కుమారుడు.ఇతని తల్లి కృపి.
అయితే ఇతడు సప్త చిరంజీవుల్లో ఒకడు.ఇతనికి మరణం అనేదే ఉండదు.
తండ్రి ద్రోణాచార్యుడికి అశ్వత్థామ అంటే చాలా ఇష్టం.అంతే కాదండోయ్.
మహా భారత యుద్ధంలో కౌరవుల పక్షాన మిగిలిన ముగ్గురిలో అశ్వత్థామ కూడా ఒకడు.అయితే ఇతడి తండ్రి అయిన ద్రోణాచార్యుడిని చంపేందుకు పన్నాగం పన్నిన పాండవులు.
సత్య హరిశ్చంద్రుడితో అబద్ధం చెప్పిస్తారు.అశ్వత్థామ హతః అని గట్టిగా చెప్పించి… కుంజరహః అని చివరలో మెల్లిగా చెప్పిస్తారు.
ఏనాడు అబద్ధం ఆడని సత్య హరిశ్చంద్రుడు.అశ్వత్థామ చనిపోయాడని చెప్పడంతో… అతని మాట నమ్మిన ద్రోణాచార్యుడు మానసికంగా కుంగిపోతాడు.
తాను కన్న కొడుకు చినిపోయాడనుకొని చేతిలో ఉన్న ఆయుధాలు పడేసి… అక్కడే కూలబడి పోయి వెక్కి వెక్కి ఏడుస్తాడు.అదే అదునుగా చేస్కున్న దృష్టద్యుమ్నునిచేతిలో మరణం పొందుతాడు.
అయితే తండ్రి మరణ వార్తకు కారణం తెలుసుకున్న అశ్వత్థామ చనిపోతున్న ద్రోణాచార్యుడి దగ్గర మాట తీసుకుంటాడు.కురుక్షేత్ర యుద్ధం ముగిశాక.
ఎలాగైనా సరే తండ్రిని హతమార్చిన దృష్ట ద్యుమ్నునిడిని చంపుతానని శపథం చేస్తాడు.అంతే కాదండోయ్ అశ్వత్థామ కురుక్షేత్ర యుద్ధ కాలంలో తన శరీరాన్ని అర్పించి శివుడి వద్ద వరం పొందుతాడు.
తనను రాత్రి చూసిన వారు అక్కడి కక్కడే మరణం పొందేలా పరమేశ్వరుడి వద్ద వరం పొందాడు.అర్థ రాత్రి పాండువులను చంపేందుకు వారుండే శిబిరానికి వెళ్తాడు.అలా ద్రౌపదీకి ధర్మరాజుకి పుట్టిన ప్రతి వింధ్యుడు, భీముడికి జన్మించిన శ్రుత సోముడు, అర్జునుడికి పుట్టిన శ్రుత కర్ముడు, నకులునికి జన్మించిన శతానీకుడు, సహదేవుడికి పుట్టిన శ్రుతసేనుడిని చంపేస్తాడు.ఈ చనిపోయిన వారంతా ఉప పాండవులు.
ఇలా మహా భారత యుద్ధంలో తనదైన ముద్ర వేశాడు అశ్వత్థామ.