హిందూ సంప్రదాయాల ప్రకారం మనకు ముక్కోటి దేవతలు ఉన్నారు.అయితే దేవీ దేవల చేతుల్లో ఉండే ఆయుధఆలు, వాటి పేర్లు, వారి లీలలకు వెనుక ఎంతో పెద్ద కథలు ఉంటాయి.
అయితే వాటన్నిటికి అలంకారాలు కూడా ఉంటాయి.<మధుర మీనాక్షి అమ్మవారి చేతిలో చిలుక ఉంటుంది.
అయితే అసలు ఆ అమ్మవారి చేతిలో చిలుకు ఎందుకు ఉంటుందనేది మాత్రం చాలా మందికి తెలియదు.అయితే అలా ఎందుకు ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మధుర మీనాక్షి అమ్మవారి చేతిలోని చిలుక జీవునికి, జీవుని ప్రాణానికి లేక మనస్సుకు ప్రతీక.అలాగే ఆమెకు మీనాక్షి లాంటి కళ్లు అంటే చేపల వంటి కళ్ల కదలని పేరు ఉంది.
ఆ పేరు వెనక ఒక రహస్యం ఉంది.చేపలు గుడ్లు పెట్టి వాటిని పొదుగుతాయనే విషయం మన అందరికీ తెలిసిందే.
అయితే వాటి నుంచి వచ్చే పిల్లలు వెంటనే ఆకలితో అలమటిస్తాయి.అయితే చేపకు స్థనాలు ఉండవు కాబట్టి.
వాటికి పాలివ్వలేదు.అయి ఆ చిట్టి చేప పిల్లల ఆకలి తీర్చేందుకు తల్లి చేప వాటి కళ్లు విప్పి చూస్తుంటుంది.
ఆ చూపుతో వాటి కడుపు నిండుతుంది.ఆదే విధంగా విష్ణువు చేతిలోని చక్రం మన మనస్సే.
మన మనస్సు చక్రం వంటిది.ప్రపంచం అంతా తిరిగి వస్తుంది.
దాన్ని పరం చేస్తే విష్ణు చక్రం అవుతుంది.ఆయన చేతిలోని గద మన బుద్ధి.
గదకు ప్రతి దానిని చితగ్గొట్టే గుణం ఉన్నట్లే.మన బుద్ధికి ప్రతీ విషయాన్ని తక్తంలో విశ్లేషించే గుణం ఉంటుంది.
దాన్ని భగవత్తర్పం చేస్తే… భగవదర్పిత బుద్ధిగా మారుతుంది.