2017 వ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో ఒక టీనేజ్ యువతిని స్థానిక బీజేపీ నేత కుల్దీప్ సెనగర్ రేప్ చేసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఒక భాద్యత గల రాజకీయ నేత అయిన కుల్దీప్ టీనేజ్ యువతిని రేప్ చేశారంటూ అప్పట్లో ఈ ఘటన దుమారం రేపింది.
అంతేకాకుండా కుల్దీప్ పై ఇంకా అనేక ఆరోపణలు నెలకొన్నాయి.ప్రస్తుతం ఈ ఆరోపణల నేపథ్యంలో కుల్దీప్ జైలు శిక్ష కూడా అనుభవిస్తున్నాడు.
అయితే రేప్ బాధితురాలు ఆదివారం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళుతున్న సమయంలో వారి కారును ఒక లారీ ఢీకొనడం ఇప్పుడు పెద్ద దుమారం రేపింది.ఈ ప్రమాదంలో ఆమెతో పాటు కారులో ఉన్న ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ మృతి చెందగా,రేప్ బాధితురాలు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది.
అయితే తమ కారును బీజేపీ నేతనే లారీ తో ఢీకొట్టించాడని బాధితురాలి తల్లి ఆరోపిస్తుంది.అయితే మరోపక్క పోలీసులు మాత్రం ఇది ముమ్మాటికీ యాక్సిడెంట్ అనే తేల్చి చెబుతున్నారు.
ఒకవేళ బాధితురాలి కుటుంబం గనుక ఈ కేసు లో సీబీఐ విచారణ కోరుకుంటే దానికి కూడా అంగీకరిస్తాం అన్నట్లు డీజీపీ తెలిపారు.
ఈ క్రమంలో ఈ రోజు ఉదయం జరిగిన రాజ్యసభ సమావేశంలో కూడా ఇదే అంశంపై వివాదం చెలరేగింది.రేప్ బాధితురాలను చంపేందుకు ప్రయత్నం జరిగిందంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి.ఈ ఘటన పట్ల సీబీఐ విచారణ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.