ఒక్కోసారి కొంతమంది నటీనటుల నటన పరంగా ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ వారికి రావలసిన గుర్తింపు మాత్రం దక్కకపోవడంతో మరుగున పడిపోయిన నటీనటులు చాలామంది ఉన్నారు.అయితే ఇందులో 2008వ సంవత్సరంలో తెలుగు హీరో అల్లరి నరేష్ హీరోగా నటించిన “సిద్దు ఫ్రం శ్రీకాకుళం” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ శ్రద్ధ దాస్ కూడా ఈ కోవకే చెందుతుంది.
అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే రెండో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకోవడంతో మంచి ఆరంభం లభించింది.ఈ చిత్రంలో నటించిన తర్వాత ఈ అమ్మడికి సినిమా అవకాశాలు బాగానే క్యూ కట్టాయి.
ఈ క్రమంలో తన పాత్రల ఈ విషయంలో కొంత మేర అవగాహన లోపించడంతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.
అయితే అప్పట్లో నటి శ్రద్ధ దాస్ ఆర్య 2, డార్లింగ్, అధినేత, డిక్టేటర్, తదితర చిత్రాలలో నటించింది.
దీంతో ఈ అమ్మడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నందమూరి నటసింహం బాలయ్య బాబు, సీనియర్ నటుడు జగపతి బాబు, తదితర స్టార్ హీరోలతో కలిసి నటించింది.కానీ ఈ చిత్రాల్లో ఈ అమ్మడు గెస్ట్ అప్పియరెన్స్, కామియో అప్పియరెన్స్ పాత్రలలో నటించింది.
అందువల్లనే శ్రద్ధ దాస్ కి హీరోయిన్ గా గుర్తింపు లభించలేదు.
అయితే అప్పట్లో ఈ అమ్మడు మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన “రేయ్” అనే చిత్రంలో విలన్ పాత్రలో నటించింది.
కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో ఈ అమ్మడికి ఇటు నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలలో కూడా అవకాశాలు రాలేదు.అన్నీ ఉన్నప్పటికీ శ్రద్ధ దాస్ ఎందుకో హీరోయిన్ గా మాత్రం అవకాశాలు దక్కించుకోవడం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
దీంతో ఈ అమ్మడి కెరియర్ కొంతమేర చప్పగా సాగుతోంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం శ్రద్ద దాస్ తెలుగు లో నూతన దర్శకుడు కార్తీక్ రాపోలు దర్శకత్వం వహించిన “ఏక్ మినీ కథ” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది.
ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తవడంతో ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఇందులో బాగంగా ఈ నెల 27వ తారీకు నుంచి ప్రసారం కానుంది.