ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.ఈ మేరకు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయడంపై జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది.ఒకసారి భారతదేశంలో కలిసిపోయాక జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక సార్వభౌమాధికారం ఉండదని పేర్కొంది.
ఈ క్రమంలోనే కేంద్రం వాదనను సమర్థించిన సుప్రీం ధర్మాసనం ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని తెలిపింది.ఈ పిటిషన్ పై ఆగస్ట్ 2వ తేదీ నుంచి సుప్రీంకోర్టులో సుధీర్ఘ వాదనలు కొనసాగిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే సెప్టెంబర్ 5న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.అయితే ఆర్టికల్ రద్దుపై కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం ధర్మాసనంలో పలు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే.