రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో మిషన్ భగీరథ పనులతో సిసి రోడ్డు గుంతలు పడడంతో వాహనాలకు ఇబ్బందిగా మారడంతో
సోమవారం గ్రామ ఆటో యూనియన్ అధ్యక్షులు కొండ శంకరయ్య శ్రమదానం చేశారు.గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా మట్టిని తీసుకొచ్చి తన సొంత ఖర్చులతో గుంతలు పూడ్చడం పై గ్రామస్తులు అభినందనలు తెలిపారు.