తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫామ్ హౌజ్ కేసులో సిట్ స్పీడ్ పెంచింది.ఇందులో భాగంగా ముగ్గురు ఎమ్మెల్యేల స్టేమ్ మెంట్లను సిట్ అధికారుల బృందం రికార్డ్ చేసింది.
ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి నివాసానికి వెళ్లి అధికారులు స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు.నిందితులు ఎలా సంప్రదించారు.? రూ.100 కోట్ల డీల్ పై ఫామ్ హౌజ్ లో ఏం మాట్లాడరనే దానిపై ఆరా తీసిన సిట్ బృందం స్టేట్ మెంట్ అంతా రికార్డ్ చేసింది.బెదిరింపు కాల్స్ పై మాదాపూర్ ఏసీపీకి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేశారు.ఉత్తరప్రదేశ్, గుజరాత్ నుంచి ఈ కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.