టాలీవుడ్ దర్శక దీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్.పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్న విషయం తెలిసిందే.
కేవలం పాన్ ఇండియా లెవెల్ లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు భాషలలో విడుదల అయ్యి సృష్టించింది.కాగా ఇప్పటికే పలు దేశాలలో విడుదల అయ్యి రికార్డులు సృష్టించగా ఇంకా కొన్ని దేశాలలో ఈ సినిమా విడుదల కాలేదు.
ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్ లో విడుదలకు సిద్ధమవుతోంది.ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ప్రమోషన్స్ ని మొదలుపెట్టేశారు.
ఈ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి ముగ్గురు కలిసి జపాన్ కి పయనం అయ్యారు.తాజాగా ఈ ముగ్గురు కలిసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకోవడంతో అక్కడికి అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుని వారి సెల్ఫోన్లలో ఫోటోలను క్లిక్ మనిపించారు.
అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.కాగా ఆ ఫోటోలు వీడియోలలో ఎన్టీఆర్ సరికొత్త లుక్ లో కనిపించారు.
ఎన్టీఆర్ లుక్ ని చూసి అభిమానులు మరింత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.జూనియర్ ఎన్టీఆర్ అయితే తన ఫ్యామిలీతో సహా జపాన్ ఫ్లైట్ ఎక్కేశారు.
రామ్ చరణ్ ఉపాసన కలిసి ఫ్లైట్ ఎక్కారు.కాగా ఈనెల 21వ తేదీన జపాన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కానున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్లో రాజమౌళితో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా పాల్గొనబోతున్నారు.జపాన్ లో ఎన్టీఆర్ కు భారీగా క్రేజ్ ఉంది.అంతేకాకుండా జపాన్ లోని సినీ ప్రేక్షకులకు ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సినిమా జపాన్ లో కూడా తప్పకుండా విజయం సాధిస్తుంది అనే చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కదా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టిన విషయం తెలిసిందే.