బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ సింగ్ రాజ్పుత్ (Sushant Singh Rajput) 2020, జూన్ 14న ముంబయిలో అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతే మనకు తెలిసిందే.ఇలా యువ నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా ఈ విషయం సంచలనంగా మారింది.
అయితే ఈయన మరణానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.ఈ విధంగా సుశాంత్ మరణించడంతో ఈయన ప్రేయసి రియా చక్రవర్తి(Riya Chakraborthy) పట్ల ఎన్నో ఆరోపణలు వచ్చాయి.
ఇలా ఒకవైపు ప్రియుడిని కోల్పోయి మరోవైపు మీడియాలో తన గురించి ఇలాంటి కథనాలు రావడంతో ఎంతో కృంగిపోయారు.
ఇలా సుశాంత్ మరణించిన తర్వాత ఈమె గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ కావడంతో కొంతకాలం పాటు మీడియాకు కూడా ఈమె దూరంగా ఉన్నారు.తాజాగా ఈమె ఒక ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె సుశాంత్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
సుశాంత్ మరణం( Sushanth Death ) తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని ఈమె తెలియజేశారు మనుషులం కనుక మన జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగిన ముందుకు సాగక తప్పదని తెలిపారు.నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయాను ఆ విషాద ఘటన తర్వాత బయటకు రావడానికి నాకు చాలా సమయం పట్టిందని ఈమె తెలియజేసారు.
సుశాంత్ మరణించిన తర్వాత నా గురించి మీడియాలో ఎన్నో కథనాలు వచ్చాయి.వాటి కారణంగా నేను చాలా నష్ట పోయాను.ఆఖరికి ఏడవడానికి కూడా నాకు వాళ్ళు సమయం ఇవ్వలేదని ఈమె ఎమోషనల్ అయ్యారు.సుశాంత్ లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిది.నా జీవితమంతా అతడిని మిస్ అవుతూనే ఉంటాను.నా స్నేహితుడు, సహచరుడు లేకుండా జీవించడం చాలా కష్టం.
కానీ జీవితంలో ముందుకు సాగక తప్పదని తన తండ్రి తనకు ఎంతో ధైర్యం చెప్పారని ఈ సందర్భంగా సుశాంత్ మరణ వార్తను తలుచుకొని రియా చక్రవర్తి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.