ఈ రోజుల్లో కామాంధుల ఆగడాలకు హద్దే లేకుండా పోయింది.అమ్మాయిలను మోసం చేయడానికి ఈ దుర్మార్గులు ఎంతకైనా తెగిస్తున్నారు.
ఎలాంటి అబద్ధాలు అయినా చెబుతున్నారు.తాజాగా ఇలాంటి ఓ నీచుడి చేతిలో దారుణంగా మోసపోయిన బాధితురాలు వెలుగులోకి వచ్చింది.
జస్వీర్ సింగ్( Jasveer Singh ) అనే ఒక వ్యక్తి యునైటెడ్ స్టేట్స్లో ( USA ) నివసించే ఒక ఎన్నారై మహిళపై ఐదేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు.ఈ కామాంధుడి పాపం పండి అతడి మోసం బయటపడింది.తాజాగా ఖన్నా పోలీసులు( Khanna Police ) కూడా అతడిని అరెస్టు చేశారు.జస్వీర్ పెళ్లి చేసుకుంటానని బాధితురాలిని ఐదేళ్లుగా నమ్మించి అత్యాచారం చేస్తున్నాడు.అత్యాచారంతోపాటు బాధితురాలి నుంచి రూ.16 లక్షలు, మూడు ఐఫోన్లు కూడా నిందితుడు కాజేశాడు.నిందితుడికి అప్పటికే వివాహమైందని బాధితురాలి సోదరి తెలుసుకుంది.ఈ విషయం బాధితురాలికి తెలియడంతో ఆమె గుండె పగిలింది.తరువాత ఎన్నారై చెల్లి ఖన్నాలోని పోలీసులకు జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు మేరకు ఖన్నా పోలీసులు జస్వీర్ సింగ్ను అరెస్ట్ చేసి లూథియానా సెంట్రల్ జైలుకు తరలించారు.నిందితుడి వల్ల నష్టపోయిన తన సోదరికి న్యాయం చేయాలని బాధితురాలి సోదరి చర్యలు తీసుకుంది.అయితే ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఎవరినీ నమ్మకూడదని హెచ్చరిస్తున్నారు.
ఇతరులకు డబ్బులు ఇవ్వకూడదని, శారీరకంగా లొంగిపోకూడదని కూడా సూచించారు.ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో కూడా పెళ్లి పేరుతో నమ్మించి అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి.
ఈ నేపథ్యంలో అమ్మాయిలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడింది.