ప్రముఖ నిర్మాత వంశీ తండ్రి స్వర్గీయులయ్యారు.గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రాణాలు విడిచారు.
దీంతో ఆయన పార్థీవదేహాన్ని స్వగ్రామమైన నెల్లూరికి తరలించారు.అంత్యక్రియలకు సినీ ప్రముఖులు హాజరై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని అందించారు.
యూవీ క్రియేషన్స్ అధినేతల్లో ఒకరైన వంశీ స్టార్ హీరోలతో సినిమాలను నిర్మించి మంచి హిట్లను సొంతం చేసుకున్నారు.
గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వంశీ తండ్రి చికిత్స పొందుతూ మరణించారు.దీంతో నిర్మాత వంశీ ఇంటా విషాద ఛాయలు అలుముకున్నాయి.టాలీవుడ్ ఇండస్ట్రీలోనే పెద్ద నిర్మాణ సంస్థ అయినా యువీ క్రీయేషన్స్ తెలియని వారు ఉండరు.రెబల్ స్టార్ ప్రభాస్ స్నేహితులైన వంశీ, ప్రమోద్ లు మిర్చి సినిమాతో నిర్మాతలుగా పరిచయమయ్యారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ హీరో శర్వానంద్ వంశీ తండ్రి అంత్యక్రియలకు హాజరై నివాళులు అర్పించారు.యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై మిర్చి, రన్ రాజా రన్, జిల్, భలే భలే మగాడివోయ్, ఎక్స్ ప్రెస్ రాజా, మహానుభావుడు, భాగమతి, ట్యాక్సివాలా, సాహో వంటి భారీ హిట్ చిత్రాలను నిర్మించారు.
ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాను నిర్మించబోతున్నారు.హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది.కాగా, కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది.