కాపులకు రిజర్వేషన్ కల్పించాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు హరిరామజోగయ్య ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 Petition In Ap High Court To Provide Reservation To Kapus-TeluguStop.com

ఈడబ్య్లూఎస్ రిజర్వేషన్ కోటాలో కేంద్రం కేటాయించిన పది శాతం రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు కేటాయిస్తూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేయాలని పిటిషన్ లో కోరారు.

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.అయితే హరిరామజోగయ్య తన పిటిషన్ లో ప్రస్తుత సీఎం జగన్ పేరును ప్రతివాదుల జాబితాలో చేర్చడంపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలో పిటిషన్ కు నంబర్ కేటాయించేందుకు నిరాకరించింది.దీంతో ముఖ్యమంత్రి పేరును ప్రతివాదుల జాబితా నుంచి తొలగిస్తామని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

అనంతరం ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి పిటిషన్ కు నంబర్ కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు.అనంతరం తదుపరి విచారణను ఈనెల 20వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube