రోశయ్య విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కొత్త డిమాండ్.!!

కాంగ్రేస్ పార్టీ కీలక నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణించటం ఒక తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాక దేశ స్థాయిలో సంచలనం రేపింది.ఏకంగా ప్రధాని మోడీ కూడా రోశయ్య మరణం పట్ల స్పందించి నివాళులర్పించారు.

 New Demand Of Telangana Congress Leaders In The Case Of Rosaiha , Congress, Koni-TeluguStop.com

కాంగ్రెస్ పార్టీకి ఎంతో నమ్మకస్తుడిగా ఉన్న రోశయ్య చివరిదాకా పార్టీలోనే కొనసాగటం జరిగింది.వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కీలకంగా… రాణించిన రోశయ్య ఆర్థికమంత్రిగా.సంచలన నిర్ణయాలు తీసుకునేవారు.తెలుగు రాష్ట్ర రాజకీయాలలో ఎంతో సీనియర్ రాజకీయ నేతగా ఉన్న రోశయ్య అసెంబ్లీ లో ప్రత్యర్థులకు తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ..చాలా విషయాలలో ప్రత్యర్థులను సైతం ఒప్పించే సత్తా కలిగిన నైపుణ్యం కలిగిన నాయకుడిగా రాణించారు.

ఈ నేపథ్యంలో రోశయ్య ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సరికొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు.రోశయ్యకి హైదరాబాద్ లో స్మృతివనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈసందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తీర్మానాన్ని కూడా తీర్మానించి దాన్ని సీఎం కేసీఆర్ కి పంపుతామని తెలిపారు.ఈ క్రమంలో రేపు గాంధీభవన్ లో… రోశయ్య కి ఘన నివాళి అర్పించటానికి ఏర్పాట్లూ చేస్తున్నారు.

ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కీలక నాయకులు తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube