శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా ఎన్నో మంచి విషయాలను సమస్త లోకానికి తెలియజేశారు.ఇందులో భాగంగానే అన్నం గురించి కూడా భగవద్గీతలో ఎంతో అద్భుతంగా ప్రస్తావించాడు.
శ్రీకృష్ణుడు అన్నం గురించి ఏం చెప్పాడంటే….అన్నం ఆ భగవంతుని సొంతం… మనది మాత్రం కాదు అని భగవద్గీత ద్వారా తెలియజేశారు.
సరైన సమయంలో వర్షాలు కురిపించి దాన్ని పండిస్తున్నారు కాబట్టి ఆ ధాన్యం నుంచి తయారయ్యే అన్నం ఆ భగవంతునికే చెందుతుందని తెలిపారు.
మన జీవనాధారం భోజనం పైనే ఆధారపడి ఉంటుంది.
మనం జీవించాలంటే భోజనం తప్పకుండా ఉండాలి.భోజనం లేనిదే జీవం కూడా లేదు.
ఇంతటి విలువైన భోజనాన్ని మనకు అందించిన ఆ దేవుని కి ఎల్లప్పుడు మనం కృతజ్ఞులమై ఉండాలి.మనం భోజనాన్ని తయారు చేసుకుని తినేటప్పుడు వాటిలో కొంత భాగం ఆ దేవుడికి నివేదనగా సమర్పించాలి.
తిరిగి ఆ నివేదనను సమస్త ప్రాణకోటికి పెట్టడం ద్వారా పుణ్య ఫలం దక్కుతుంది.
మన శరీరం పంచకోశములుతో నిర్మితమై ఉంటుంది.
అందులో ముఖ్యమైనది అన్నమయకోశం, ప్రాణమయకోశం అందుకే శరీరంలో అన్నమయ కోశం శరీరం గాను,ప్రాణమయ కోశం ఆత్మగాను భావిస్తారు. సద్గృహస్తులు అతిథులకు అన్నం సిద్ధంగా ఉందని,అతిథులు ఏ సమయంలో ఇంటికి వచ్చిన వారికి అన్నం పెట్టడానికి వీరు సిద్ధంగా ఉంటారు.
అలాంటి వారికి ఎల్లప్పుడు ఆహారంలో లోటు లేకుండా నిత్యం ధనధాన్యాలు పొందుతారు.
ఎవరైతే ఇక తప్పదు అన్నట్టుగా వండిన అన్నాన్ని అతిథులకు సమర్పిస్తారో, అలాంటి వారికి వారి జన్మాంతం అంతే తక్కువ శ్రద్ధతో సమర్పించబడిన అన్నం తిరిగి వారికి చాలా అరుదుగానే దొరుకుతుంది.
మరి కొంతమంది ఎవరైనా అతిథులు,అభాగ్యులు ఇంటికి వచ్చి అన్నాన్ని అడిగితే వారికి ఎంతో నీరసంగా అన్నంలేదు పో.అని అంటారో.అలాంటి వారికి అన్నం దొరకడం ఎంతో కష్టం అవుతుంది.కాబట్టి ఇంటికి ఏ సమయంలోనైనా అభాగ్యులు వచ్చినప్పుడు వారికి కొంతవరకు అన్నాన్ని పెట్టడం ద్వారా ఆ భగవంతుని ఆశీస్సులు పొంది నిత్యం అన్నానికి కొదవ లేకుండా మనకు ప్రసాదిస్తాడని, శ్రీ కృష్ణ పరమాత్ముడు భగవద్గీత ద్వారా తెలియజేశారు.