ఈ ఏడాది మొదటి సోమావతి అమావాస్య ఫిబ్రవరి 20వ తేదీన సోమవారం వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్య అని పిలుస్తారు ఈ రోజున శివపార్వతులను పూజిస్తారు.మహాశివరాత్రి రోజున పవిత్ర నదిలో స్నానం చేయడం చాలా పవిత్రమని పెద్దవారు చెబుతూ ఉంటారు.
ఈ రోజున వివాహిత మహిళలు కూడా తమ భర్తల దీర్ఘాయుష్షు కాంక్షిస్తూ ఉపవాసం పాటిస్తారు.
వివాహిత మహిళలకు ఈ రోజు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
ఈ రోజున వివాహిత స్త్రీలు శివ ఫలితాలను ఇచ్చే కొన్ని చర్యలు తీసుకోవాలి.సోమావతి అమావాస్య రోజున పార్వతీ మరియు శివుడిని పూజించడం విశేష ఫలితాలు లభిస్తాయి.
మహిళలు శివలింగానికి పచ్చిపాలతో అభిషేకం చేయాలి.దీనితో పాటు సుగంధ వస్తువులను తల్లి పార్వతికి సమర్పించాలి.

ఇలా చేయడం వల్ల అఖండ సౌభాగ్యం కలుగుతుంది.అంతేకాకుండా భర్త ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి కూడా బయటపడతాడు.సోమావతి అమావాస్య రోజున మీ పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి దేవాలయానికి వెళ్లి రావి చెట్టును నాటండి.ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారు.ఈ పరిహారం పితృ దోషాన్ని కూడా తొలగిస్తుంది.సోమావతి అమావాస్య తిధి రోజు కుంకుమ పువ్వులను హవనంలో సమర్పించండి.
తరువాత చేతులు జోడించి తెలిసిన లేదా తెలియని తప్పులకు క్షమాపణలు కోరండి.

ఇలా చేయడం వల్ల పితృ దోషం తగ్గి అద్భుతమైన ఫలితాలు వస్తాయి.సోమావతి అమావాస్య రోజు తెల్లవారుజామున శివుని ఆచార పూజలు చేసేటప్పుడు రుద్రాభిషేకం చేయండి.దీని తర్వాత ఒక పుణ్యక్షేత్రానికి వెళ్లి ఒక జత వెండి పాములను పూజించండి.అప్పుడు జంట పాములను ప్రవాహంలో తెలియడనివ్వండి.ఆ తర్వాత కాలసర్ప దోషం నుంచి విముక్తి కోసం చేతులు జోడించి ప్రార్థించండి.ఇలా చేయడం వల్ల కాలసర్ప దోషం దూరమై ఐశ్వర్యం పెరుగుతుంది.భార్యాభర్తల మధ్య ఎప్పుడూ ఎక్కువగా గొడవలు జరుగుతుంటే సోమావతి అమావాస్య రోజున గోవుకు ఐదు రకాల పండ్లు తినిపించండి.
ఆ తర్వాత శ్రీహరి మంత్రాన్ని జపిస్తూ తులసికి 108 సార్లు ప్రదక్షిణ చేయండి.