లోక్ సభలో చోటు చేసుకున్న టియర్ గ్యాస్ ఘటనపై కేసు నమోదు అయింది.ఈ ఘటనలో మొత్తం ఏడుగురు నిందితులు ఉండగా.
వీరంతా ఎవరనే దానిపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.
అలాగే ఈ వ్యవహారంలో ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు మరొకరి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో జరిగిన ఈ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.స్మోక్ స్పే ఘటన నేపథ్యంలో పార్లమెంట్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇందులో భాగంగా పర్మిషన్ ఉన్న వాహానాలను మాత్రమే అనుమతి ఇస్తున్నారు.అయితే గత నాలుగేళ్లుగా ఏడుగురికి పరిచయం ఉందని పోలీసులు విచారణలో వెల్లడైందని తెలుస్తోంది.







