తెలుగులో బాలకృష్ణకి జోడీగా లెజెండ్, లయిన్ సినిమాలలో ఆడిపాడిన బాలీవుడ్ ముద్దుగుమ్మ రాధికా ఆప్టే.ఈమె గురించి ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
బోల్డ్ కామెంట్స్ తో బోల్డ్ యాక్టింగ్ తో ఎప్పుడు ఈ అమ్మడు వార్తల్లో ఉంటూ ఉంటుంది.క్యారెక్టర్ డిమాండ్ చేస్తే న్యూడ్ గా నటించడంతో పాటు బెడ్ రూమ్ సన్నివేశాలు చేయడానికి కూడా ఒకే చెప్పే ఈ అమ్మడు డేరింగ్ కి బాలీవుడ్ అందరూ ఫిదా అయిపోతూ ఉంటారు.
ఈ మధ్యకాలంలో సినిమాలు తగ్గిన వెబ్ సిరీస్ లో తన బోల్డ్ పెర్ఫార్మెన్స్ తో అందరిని రాధికా ఆప్టే మెస్మరైజ్ చేస్తుంది.థియేటర్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి, తరువాత నటిగా మారిన ఈ భామ బోల్డ్ గా నటించడంతో పాటు అప్పుడప్పుడు వివాదాస్పద వాఖ్యలతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది.
తాజాగా ఈమె చేసిన వాఖ్యలు బాలీవుడ్ లో మరోసారి హాట్ టాపిక్ గా మారాయి.
ఓ మీడియా ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే మాట్లాడుతూ తాను బాలీవుడ్ కు అవకాశాల కోసం వెళ్లాలనుకున్నప్పుడు తాను నివసించే పూణే నుంచి ముంబై ప్రయాణం చేయాలని అనుకున్నానని కానీ ఆ సమయంలో చాలా మంది బాలీవుడ్ కు వెళితే అత్యాచారాలు చేస్తారని, అక్కడ చాలా క్రూరమృగాలు ఉన్నాయని బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎప్పటి నుంచో జరిగే తంతు ఇదేనని భయపెట్టే ప్రయత్నం చేశారు.
సినీ పరిశ్రమలో జరిగే సంఘటనలపై ప్రజలకు సదభిప్రాయం లేదని తరువాత తనకి అర్ధమైందని పేర్కొంది.మనం బాలీవుడ్ గురించే అతిగా మాట్లాడుకుంటామని, కానీ అన్ని ఇండస్ట్రీలలో అలాంటి సంఘటనలు అక్కడక్కడా జరుగుతాయి కాబట్టే బయట తప్పుగా మాట్లాడుకుంటున్నారని తెలిపింది.
మనమంతా మనుషులమని, అందరిని అదే భావనతో చూడటం తగదని ఈ సందర్భంగా రాధికా చెప్పుకొచ్చింది.